ETV Bharat / state

రాచకొండ కమిషనరేట్​కు ఒక్కరోజు కమిషనర్​

author img

By

Published : Oct 29, 2019, 11:08 PM IST

రాచకొండ కమిషనరేట్‌కు ఒక్కరోజు కమిషనర్ వచ్చారు. క్యాన్సర్​తో​ బాధపడుతున్న ఓ బాలిక కోరిక తీర్చేందుకు పోలీసులు ముందుకొచ్చారు. ఒక్కరోజు కమిషనర్‌గా అవకాశం కల్పించారు సీపీ మహేష్​ భగవత్​. మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా ఇది సాధ్యమయ్యింది.

రాచకొండ కమిషనరేట్​కు ఒక్కరోజు కమిషనర్​

లుకేమియా వ్యాధితో పోరాడుతున్న ఓ బాలిక కలను రాచకొండ సీపీ మహేష్​ భగవత్​ నిజం చేశారు. మంగళ వారం ఒక్కరోజు కమిషనర్​గా బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించారు. అల్వాల్ సుచిత్రకు చెందిన 17ఏళ్ల రమ్య ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. చదువులో అందరికన్న ముందుండే రమ్య... గత కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్​ 'లుకేమియా'తో బాధపడుతోంది. చిన్ననాటి నుంచి పోలీస్​ ఆఫీసర్​ కావాలని కలలుగన్న తమ బిడ్డ కోరికను మేక్​ ఏ విష్​ సంస్థ ప్రతినిధులకు చెప్పారు రమ్య తల్లిదండ్రులు. సంస్థ ప్రతినిధులు రాచకొండ సీపీ మహేష్ భగవత్​ను కలిసి బాలిక విషయం తెలిపారు. రమ్య పరిస్థితి తెలుసుకున్న సీపీ... బాలిక కలను నిజం చేయడానికి ఒప్పుకున్నారు. మంగళవారం ఒక్కరోజు కమిషనర్​గా బాధ్యతలు స్వీకరించిన రమ్య పోలీసులకు తగు సూచనలు చేసింది. పెట్రోలింగ్​ని పెంచాలని... శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులోకి రావడానికి కృషి చేయాలని తెలిపింది. తమ బిడ్డ కలను నెరవేర్చిన పోలీసు అధికారులకు రమ్య తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. రమ్య త్వరగా కోలు కోవాలని....పోలీస్ శాఖ అండగా ఉంటుదని సీపీ మహేష్​ భగవత్​ తెలిపారు.

రాచకొండ కమిషనరేట్​కు ఒక్కరోజు కమిషనర్​

ఇదీ చూడండి: బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు బీమా సొమ్ము పంపిణీ

TG_HYD_63_29_RACHAKONDA_CP_MAKE_A_WISH_AV_3182400 note: ఫోటోలు,వీడియోలు డెస్క్ వాట్సప్ కి పంపాము ( )లుకేమియా వ్యాధి తో పోరాడుతున్న ఓ బాలిక పోలీస్ కమిషనర్ కావాలన్న కలను రాచకొండ సీపీ మహేష్ భగవత్ నిజం చేశారు. అల్వాల్ సుచిత్ర కు చెందిన 17ఏళ్ళ రమ్య ఇంటర్ ద్వితియ సంవత్సరం చదువుతుంది. చదువులో అందరికన్న ముందున్న రమ్య గత కొంత కాలంగా బ్లడ్ కాన్సర్ లుకేమియా తో బాధపడుతుంది. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న రమ్యకు పోలీస్ కమిషనర్ అవ్వలని చిన్నప్పటినుంచి కోరిక ఉండేది. తమ కూతురు ఆశయాన్ని మేక్ ఏ విష్ సంస్థకు తల్లిదండ్రులు తెలిపారు. దీంతో సంస్థ ప్రతినిధులు రాచకొండ సీపీ మహేష్ భగవత్ కోరగా రమ్య కలను నిజం చేయడానికి సీపీ ఒప్పుకున్నారు. మంగళ వారం ఒక రోజు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రమ్య పోలీసులకు తగు సూచనలు చేసింది. పెట్రోలింగ్ ని పెంచాలని ...శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులోకి రావడానికి కృషి చేయాలని తెలిపింది. తన కలను నెరవేర్చినందుకు రమ్య తల్లిదండ్రులు సీపీ మహేష్ భగవత్ కు కృతజ్ఞతలు తెలిపారు. రమ్య త్వరాగా కోలు కోవాలని....పోలీస్ శాఖ అండగా ఉంటుదని సీపీ తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.