ETV Bharat / state

'సింగరేణిని ప్రైవేటుపరం చేయమని చెప్పి.. బొగ్గు గనులు ఎందుకు వేలం వేస్తున్నారు..'

author img

By

Published : Dec 7, 2022, 3:46 PM IST

MP Nama Fire on Central Govt: తెలంగాణ పట్ల కేంద్రం చిన్న చూపు చూస్తోందని టీఆర్​ఎస్ ఎంపీ నామ నాగేశ్వర రావు ధ్వజమెత్తారు. సింగరేణిని ప్రైవేటుపరం చేయబోమని చెప్పి ఇప్పుడు బ్లాకులు వేలం వేయాలని చూస్తోందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని టీఆర్ఎస్ అడ్డుకుంటుందని ఆరోపించారు.

MP Nama Nageshwar Rao
MP Nama Nageshwar Rao

MP Nama Fire on Central Govt: సింగరేణి ప్రైవేటుపరం చేయబోమని చెప్పి ఇప్పుడు కేంద్రం బ్లాకులు వేలం వేయడానికి సిద్ధపడుతోందని టీఆర్​ఎస్ ఎంపీ నామ నాగేశ్వర రావు ధ్వజమెత్తారు. సింగరేణి వాటలో కేంద్రానికి ఉన్న 49 శాతం వాటా రాష్ట్రం తీసుకుంటుందని చెప్పినా కేంద్రం ఒప్పుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

తెలంగాణ పట్ల కేంద్రం చిన్న చూపు చూస్తోందని విమర్శించిన ఆయన.. విధాన పరమైన నిర్ణయంతో వేలం వేశామని కేంద్రం అంటుండడం విడ్డురంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు తీసుకునేలా కేంద్రం చట్టం తీసుకురావడం చాలా బాధాకరమని అన్నారు. ఇకనైనా రాష్ట్ర అంశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలిని నామ సూచించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.