ETV Bharat / state

లంబాడి తండాలోని డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్లు​ దాదాపు పూర్తి: ముఠా గోపాల్

author img

By

Published : Oct 6, 2020, 8:41 PM IST

హైదరాబాద్​ ముషీరాబాద్ నియోజకవర్గంలోని లంబాడి తండాలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. అక్కడ పర్యటించి నిర్మాణ పనులను పర్యవేక్షించారు.

mla muta gopal visit double bed room houses at lambadi tanda in hyderabad musheerabad
లంబాడి తండాలోని డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్లు​ దాదాపు పూర్తి: ఎమ్మెల్యే

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేకుండా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్​లింగంపల్లిలోని లంబాడి తండాలో చేపడుతున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. 95 శాతం వరకూ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వివరించారు.

mla muta gopal visit double bed room houses at lambadi tanda in hyderabad musheerabad
లంబాడి తండాలోని డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్లు​ దాదాపు పూర్తి: ఎమ్మెల్యే

లంబాడి తండాలో 120 మందికి రెండు పడక గదుల ఇళ్లు పూర్తయ్యాయని కరెంటు, ఫ్లోరింగ్ పనులు మాత్రమే మిగిలాయన్నారు. మిగిలిన పనులు కూడా అతి త్వరగా పూర్తవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు ముఠా జైసింహ, ఆర్.మోజెస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ప్రభుత్వరంగ సంస్థల బకాయిలే రూ.200కోట్లు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.