ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేకుండా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్లింగంపల్లిలోని లంబాడి తండాలో చేపడుతున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించారు. 95 శాతం వరకూ ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వివరించారు.
లంబాడి తండాలో 120 మందికి రెండు పడక గదుల ఇళ్లు పూర్తయ్యాయని కరెంటు, ఫ్లోరింగ్ పనులు మాత్రమే మిగిలాయన్నారు. మిగిలిన పనులు కూడా అతి త్వరగా పూర్తవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ నాయకులు ముఠా జైసింహ, ఆర్.మోజెస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ప్రభుత్వరంగ సంస్థల బకాయిలే రూ.200కోట్లు