ETV Bharat / state

అత్యాచారయత్నంలో గాయపడిన బాలికకు రెయిన్​బో ఆసుపత్రిలో చికిత్స

author img

By

Published : Oct 8, 2020, 6:22 PM IST

ఖమ్మంలో బాలికపై అత్యాచార యత్నం, పెట్రోల్ దాడి ఘటనపై మంత్రి సత్యవతి రాఠోడ్​ స్పందించారు. గాయపడిన బాలికకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. హైదరాబాద్‌లోని రెయిన్​బో ఆస్పత్రిలో చేర్పించాలని ఆదేశించారు.

అత్యాచారయత్నంలో గాయపడిన బాలికను రెయిన్​బో ఆస్పత్రికి తరలింపు
అత్యాచారయత్నంలో గాయపడిన బాలికను రెయిన్​బో ఆస్పత్రికి తరలింపు

ఖమ్మంలో మైనర్​ బాలికపై అత్యాచార యత్నం, పెట్రోల్​ దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్​లోని ఆస్పత్రికి తరలించారు. బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్​ బాధితురాలిని రెయిన్​బో ఆస్పత్రిలో వైద్యం అందించాలని ఆదేశించారు.

ఈ మేరకు మహిళా శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య... స్వయంగా పర్యవేక్షిస్తూ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని మంత్రి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.

ఇదీ చూడండి: గోదావరిలో దూకిన వివాహిత.. రక్షించిన జాలర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.