ETV Bharat / state

బ్లాక్‌ఫంగస్‌ సోకి చూపు కోల్పోయిన వ్యక్తి.. మనస్తాపంతో ఆత్మహత్య

author img

By

Published : Jan 16, 2022, 11:22 AM IST

Updated : Jan 16, 2022, 12:23 PM IST

Suicide with Blank Fungus
బ్లాక్‌ఫంగస్​తో వ్యక్తి ఆత్మహత్య

11:17 January 16

Suicide with Blank Fungus: ఉస్మానియాలో చికిత్స పొందుతూ మృతి

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్​ పరిధిలో ఓ వ్యక్తి.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమవతిపేట్​కు చెందిన ఓ వ్యక్తికి కొన్నిరోజుల క్రితం బ్లాక్​ఫంగస్ సోకింది. దీంతో అతను చూపు కోల్పోయాడు. అప్పటి నుంచి అతను తీవ్ర మనస్తాపం చెందాడు. కుటుంబ సభ్యులు ఎంత నచ్చజెప్పినా అతను ఆ బాధను జయించలేకపోయాడు.

దీంతో తీవ్రమనస్తాపంతో.. పురుగులమందు తాగాడు. గుర్తించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియాలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుమారుడి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇదీ చూడండి: యువకుడి మెడకు బిగుసుకున్న తాడు- అలాగే లాక్కెల్లిన ఎద్దు..!

Last Updated : Jan 16, 2022, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.