ETV Bharat / state

'రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీలు నెరవేర్చడం లేదు'

author img

By

Published : Sep 10, 2020, 8:46 PM IST

ఏడేళ్లుగా కేంద్రం తెలంగాణను పెడచెవిన పెట్టిందని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, హామీలు నెరవేర్చడం లేదని అన్నారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కేసీఆర్‌ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

k keshava rao comments on central government Parliament session will be in season
'రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీలు నెరవేర్చడం లేదు'

'రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీలు నెరవేర్చడం లేదు'

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశం తర్వాత కె.కేశవరావు, నామ నాగేశ్వర్‌రావు పలు అంశాల గురించి వివరించారు. ఏడేళ్లుగా కేంద్రం తెలంగాణను పెడచెవిన పెట్టిందని కేశవరావు అన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, హామీలు నెరవేర్చడం లేదని చెప్పారు. రాబోయే పార్లమెంట్​ సమావేశాల్లో పోరాటానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

ఇప్పటివరకు కృష్ణ నదీ జలాల వివాదాన్ని కేంద్రం తేల్చలేదన్నారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం ఈసారి 24 శాతానికి పెరిగిందని.. సాగు విస్తీర్ణానికి తగ్గట్టు కేంద్రం యూరియా ఇవ్వడం లేదని అన్నారు. కేంద్రం తీసుకొస్తున్న నూతన విద్యుత్ చట్టంను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. నూతన విద్యుత్‌ చట్టంతో కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూస్తోందని ఎద్దేవా చేశారు. జాతీయ రహదారుల విస్తరణపై కేంద్రం మాట తప్పిందన్నారు.

తెలంగాణకు ఇప్పటివరకు ఇంకా 22 నవోదయ పాఠశాలలు రావాలని తెలిపారు. నవోదయ పాఠశాలలపై కేంద్రం స్పందించడం లేదన్నారు. జీఎస్టీ చట్టాన్ని కేంద్రం ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.10 వేల కోట్లను ఇవ్వట్లేదన్నారు. వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కుకు నయాపైసా ఇవ్వలేదని, ఎయిర్‌స్ట్రిప్‌లను కూడా కేంద్రం ప్రకటించడం లేదని అన్నారు. ఈసారి సమస్యలపై నో కాంప్రమైజ్​ అని.. పార్లమెంట్​ సేషన్​ హంగామాగానే ఉంటుందని కేశవరావు వెల్లడించారు.

ఇదీ చూడండి : పిడుగు పడి వ్యక్తి మృతి..స్పృహ కోల్పోయిన 12 మంది రైతులు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.