ETV Bharat / state

కేంద్రమాజీ మంత్రి చిదంబరం రాకతో... సిక్రిందాబాద్​లో సందడి

author img

By

Published : Feb 8, 2020, 7:29 PM IST

కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం హైదరాబాద్​ రాకతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లో సందడి నెలకొంది. సికింద్రాబాద్ తుకారం గేట్​లో​ సీనియర్​ కాంగ్రెస్​ నాయకుడి ఇంట్లో రేపు జరగబోయే వివాహా కార్యక్రమంలో పాల్గొని వధువును ఆశ్వీరదించారు.

chidambaram participated marriage celebrations at tukaramgat
మాజీ మంత్రి చిదంబరం రాకతో సిక్రిందాబాద్​లో సందడి

తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ కుమార్తె వివాహా కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఘన స్వాగతం పలికారు. వివాహా కార్యక్రమంలో పాల్గొని వధువుని ఆశ్వీరదించారు. సీతాఫల్​మండి మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి చిదంబరానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

చిదంబరం వస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సికింద్రాబాద్ తుకారం గేట్​లో ఉన్న సంతోశ్​ కుమార్​ ఇంటికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

మాజీ మంత్రి చిదంబరం రాకతో సిక్రిందాబాద్​లో సందడి

ఇదీ చూాడండి: ఒళ్లు గగుర్పొడిచేలా సాగిన తిరు ఉత్సవ్​ పోటీలు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.