ETV Bharat / state

1952లో దేశాన్ని విడిచారు... 2019లో వచ్చారు!

author img

By

Published : Nov 18, 2019, 11:09 AM IST

చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు బీజీ జీవితాన్ని వదిలి ఓ విదేశీదంపతులు భారతదేశానికి వచ్చారు. బాల్యంలోని మధురానుభూతులను నెమరువేసుకునేందుకు ఆంధ్రాలో అడుగుపెట్టారు. ఎప్పుడో ఆరు దశాబ్దాల క్రితం తమ తల్లిదండ్రులతో మాచ్​ఖండ్ విద్యుత్ కేంద్ర నిర్మాణానికి వచ్చిన వారు... మళ్లీ అక్కడికే వచ్చి చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు.

Foreign couple childhood news in visakha

బాల్యం నాటి తీపి గుర్తులను వెతుకుంటూ ఏకంగా దేశాలు దాటి వచ్చింది ఓ జంట. ఎప్పుడో ఆరు దశాబ్దాల క్రితం తమ తల్లిదండ్రులతో మాచ్​ఖండ్ విద్యుత్ కేంద్రం వద్ద గడిపిన వారు ... మళ్లీ ఇన్నాళ్లకు ఆ ప్రాంతానికి వచ్చారు. ఇంగ్లాండ్​కు చెందిన రిచార్డ్ గార్డ్, జెన్నిఫర్ గార్డ్​ దంపతులు ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లాలోని మాచ్​ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి ఆదివారం వచ్చారు. వీరివురి తల్లిదండ్రులు 1950 నుంచి 1952 వరకు విద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలో సొరంగాలలో పని చేశారు. వీరు బాల్యంలో రెండేళ్లు ఈ ప్రాంతంలోనే గడిపారు. అనంతరం దేశాన్ని వీడి ఇంగ్లాండ్​లో స్థిరపడ్డారు. ఒకప్పుడు స్నేహితులైన రిచార్డ్ గార్డ్, జెన్నిఫర్ గార్డ్​లు భార్యాభర్తలుగా మారారు.​ అప్పుడు వెళ్లిపోయిన వీరు మళ్లీ ఇన్నేళ్ల తరువాత మాచ్​ఖండ్​ ప్రాజెక్ట్ సందర్శించి వారి చిన్ననాటి మధుర స్మృతులను స్థానికులతో పంచుకున్నారు. కాసేపు ఆ ప్రాంతంలో ఆనందంగా గడిపారు.

1952లో దేశాన్ని విడిచారు... 2019లో వచ్చారు!

ఇదీచూడండి.'కాలుష్య పోరు'లో ప్రపంచం నుంచి భారత్​ నేర్చుకోవాల్సింది?

Intro:సాధారణంగా మనం వృత్తిరీత్యా పలు గ్రామాల్లో పనులు చేస్తుంటాం. అక్కడ పని పూర్తయిన తర్వాత వేరే చోటికి బయలుదేరుతాము. మళ్లీ అక్కడ పని పడితే గాని అక్కడికి రావడానికి ఎవరూ ఇష్టపడరు. ఎప్పుడో ఆరు దశాబ్దాల క్రితం తన తల్లిదండ్రులతో విద్యుత్ కేంద్ర నిర్మాణానికి వచ్చిన చిన్నారులు మళ్లీ మాచఖండ్ రావడానికి ఆసక్తి కనబరచడం సర్వత్ర ప్రత్యేకత చాటుకుంది. ఇంగ్లాండ్ కు చెందిన ఇద్దరి విదేశీయుల ప్రయాణం గురుంచి తెలుసుకుందాం.


Body:ఇంగ్లాండ్ కు చెందిన రిచార్డ్ గార్డ్ జెన్నిఫర్ s గార్డ్ ల దంపతులకు ఆదివారం నాడు మాచకుంద్ జలవిద్యుత్ కేంద్రం లో ఘనస్వాగతం పలికారు.వీరిద్దరి తల్లి తండ్రులు అయిన జార్జ్ ఏ గార్డ్, రోజర్ న్యూపోర్ట్ లు విద్యుత్ కేంద్రం నిర్మానసమయం లో అంటే 1950 నుంచి 1952 వరకు సొరంగాలు నిర్మాణం లో పని చేసారు. వీరిద్దరి బాల్యం లో రెండేళ్లు ఈ ప్రాంతం లో గడిపారు.ఆరు దశాబ్దాల తరువాత ఆదివారం నాడు వారిద్దరూ మాచకుండ్ ప్రాజెక్ట్ సందర్శించి వారి చిన్ననాటి మధుర స్మృతులు లను స్థానికులు తో పంచుకున్నారు.


Conclusion:ప్రాజెక్ట్ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు,స్థానిక యువకులు వచ్చి వారికి స్వాగతం పలికారు.
బైట్ 1
రిచార్డ్ గార్డ్
బైట్ 2
జెన్నిఫర్ s గార్డ్
బైట్3
వై. ఈశ్వర రావు
విశ్రాంత ఉద్యోగి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.