ETV Bharat / state

JAGGAREDDY: భూపాలపల్లి సభకు హాజరు కాలేనన్న జగ్గారెడ్డి... ఎందుకంటే?

author img

By

Published : Sep 30, 2021, 7:29 PM IST

తాను భూపాలపల్లి సభకు హాజరు కాలేకపోతున్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్(pcc working president jaggareddy) జగ్గారెడ్డి తెలిపారు. కోర్టుకు హాజరు కావాల్సి ఉండడం వల్లే హాజరు కాలేకపోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్‌(telangana congress)లో చిన్నపాటి సమాచార లోపం పెద్ద వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో ఆయన సభకు హాజరు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

JAGGAREDDY: భూపాలపల్లి సభకు హాజరు కాలేనన్న జగ్గారెడ్డి... ఎందుకంటే?
JAGGAREDDY: భూపాలపల్లి సభకు హాజరు కాలేనన్న జగ్గారెడ్డి... ఎందుకంటే?

కోర్టుకు హాజరు కావాల్సి ఉండడం వల్లనే తాను భూపాలపల్లి సభకు హాజరు కాలేకపోతున్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(pcc working president jaggareddy) తెలిపారు. ఇదే విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(tpcc chief revanth reddy)కి, కాంగ్రెస్​ సీనియర్​ నేత శ్రీధర్​బాబుకు కూడా సమాచారం ఇచ్చినట్లు వివరించారు. ఈ సాయంత్రం భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని వివరించారు. ఆ సమావేశానికి రావాలని తనకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సత్యనారాయణ రావు ఫోన్ చేశారని తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గం వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉంటుందని.. దానికి తాను ఇంఛార్జినని పేర్కొన్న జగ్గారెడ్డి.. ఒక కేసులో మధ్యాహ్నం 2 గంటలకు కోర్టుకు హాజరుకావాల్సి ఉండడం, తప్పనిసరి కావడం వల్ల భూపాలపల్లికి రాలేకపోతున్నట్లు వివరించారు. తాను ఎందుకు హజరు కాలేదని మీడియాలో వేరే సంకేతాలు వెళ్లకుండా ఉండేందుకే ఈ వీడియో విడుదల చేస్తున్నట్లు వివరించారు.

ఇటీవల జహీరాబాద్‌లో ఏర్పాటు చేసిన క్రికెట్‌ టోర్న్‌మెంట్​ కార్యక్రమానికి తనకు ఆహ్వానం లేకపోవడంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై ఆ జిల్లా ఎమ్మెల్యే, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు(jaggareddy and revanth reddy controversy). తనకు సమాచారం లేకుండా నియోజకవర్గానికి వెళ్లడంతో, పీసీసీ అధ్యక్షుడికి తనకు మధ్య విభేదాలు ఉన్నట్లు పరోక్షంగా పీసీసీ(tpcc) చెప్పాలనుకున్నారా? అని మీడియా ముందు జగ్గారెడ్డి నిలదీశారు. దీంతో అప్రమత్తమైన ఏఐసీసీ.... నాయకుల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ మీడియా ముందుకు వెళ్లడం సరికాదని తీవ్రంగా స్పందించిన అధిష్ఠానం... రాష్ట్ర ఇంఛార్జి, ఏఐసీసీ కార్యదర్శుల ద్వారా విషయాన్ని ఆరా తీసింది. ఈ నేపథ్యంలో ఆయన సభకు హాజరు కాకపోవడం కాంగ్రెస్​ నేతల మధ్య విభేదాలు ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

JAGGAREDDY: భూపాలపల్లి సభకు హాజరు కాలేనన్న జగ్గారెడ్డి... ఎందుకంటే?

ఈ రోజు భూపాలపల్లిలో సత్యనారాయణ కాంగ్రెస్​లో చేరనున్నారు. భూపాలపల్లి నియోజకవర్గానికి నేను ఇంఛార్జి. ఇవాళ సభకు హాజరు కావడం లేదని టీపీసీసీ చీఫ్​ రేవంత్​కు ఫోన్​లో చెప్పాను. ఇవాళ నాంపల్లి కోర్టులో ఓ కేసు జడ్జిమెంట్​ ఉంది. అందుకనే ఈ రోజు హాజరు కాలేకపోతున్నా. -జగ్గారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

ఇదీ చదవండి: jaggareddy and revanth reddy controversy: పెద్దల జోక్యంతో టీపీసీసీలో సద్దుమణిగిన అంతర్గత కలహాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.