ఉపాధిలేక ఇబ్బందిపడుతున్న సినీ కార్మికులకు సినీ పెద్దలు అండగా నిలుస్తున్నారు. ఇందిరానగర్లోని సినీ కార్మికులకు కెమెరామెన్ ఆండ్రూ నిత్యావసర సరకులు అందించారు. కార్మికుల కష్టాలను కార్మిక సంఘ సేవకుడు పుట్టా రామకృష్ణ సామాజిక మాధ్యమాల ద్వారా సినీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.
ఒకవైపు నగరంలో లైవ్గా పంపిణీ చేస్తూనే... సొంతూళ్లకు వెళ్లిపోయిన కార్మికులు సొంతూరిలో నిత్యావసర సరకులు కొనుగోలు చేసి వివరాలు వాట్సప్ చేస్తే నగదుపంపిస్తున్నారు. గత 14 రోజులుగా రోజు 150 మందికి పైగా నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 15 వందల మంది సినీ కార్మికులు సహాయం చేసినట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో సంఘసేవకుడు పుట్టా రామకృష్ణ, సంధ్యారాణి, కిశోర్కుమార్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తెలంగాణ మణిరత్న-2021 అవార్డులు ప్రదానం