ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​ చివరి మ్యాచ్​లో భారత్ విజయం

author img

By

Published : Nov 8, 2021, 10:28 PM IST

టీ20 ప్రపంచకప్​ను టీమ్ఇండియా​ విజయంతో పూర్తిచేసింది. నమీబియాపై 9వికెట్ల తేడాతో గెలిచింది.

india beat namibia
టీమ్​ఇండియా

నామమాత్ర మ్యాచ్​లో టీమ్​ఇండియా విజయం సాధించింది. నమీబియాపై 9 వికెట్ల తేడాతో గెలిచింది. దుబాయ్​లో సోమవారం జరిగిన ఈ పోరులో 133 పరుగుల లక్ష్యాన్ని 15.2 ఓవర్లలోనే పూర్తి చేసింది. రోహిత్ శర్మ(56), కేఎల్ రాహుల్(50) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు.

india beat namibia
రోహిత్ శర్మ

అంతకుముందు టాస్ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన నమీబియా.. నిర్ణీత 20 ఓవర్లలో 132/8 స్కోరు చేసింది. డేవిడ్ వీస్ అత్యధికంగా 26 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాటర్లలో బార్డ్ 21, వాన్ లింజన్ 14, ఫ్రై లింక్ 15 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్, జడేజా తలో మూడు వికెట్లు.. బుమ్రా రెండు వికెట్లు తీశాడు.

ఇది చదవండి: టీ20 సారథిగా కోహ్లీ ప్రస్థానం.. ఇవే రికార్డులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.