ETV Bharat / sports

డ్రెస్సింగ్ రూమ్​లోకి ప్రధాని-టీమ్‌ఇండియా ఆటగాళ్లను ఓదార్చిన మోదీ

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 12:36 PM IST

Updated : Nov 21, 2023, 1:28 PM IST

World Cup 2023 Final : వన్డే ప్రపంచకప్​లో టీమ్ఇండియా ఓటమి పట్ల అటు క్రికెట్ అభిమానులతో పాటు ప్లేయర్లు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఆ బాధ నుంచి ఎవ్వరూ కోలుకోలేదు. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి టీమ్ఇండియా ఆటగాళ్లను ఓదార్చారు. దానికి సంబంధించిన వీడియో మీ కోసం..

World Cup 2023 Final
World Cup 2023 Final

World Cup 2023 Final : వన్డే ప్రపంచకప్​ ఫైనల్ భాగంగా జరిగిన భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్​లో ఆస్ట్రేలియాదే పై చేయిగా నిలిచింది.హోరా హోరీగా జరిగిన మ్యాచ్​లో టీమ్ఇండియా ప్లేయర్లు తమ శాయశక్తులా పోరాడినప్పటికీ.. విజయం కంగారూలనే వరించింది. దీంతో టీమ్ఇండియా డీలా పడింది. వరుస విజయాలతో సూపర్ ఫామ్​లో ఉన్న ఆ జట్టు.. ఇలా ఫైనల్స్​లో ఓటమి పాలవ్వడం పట్ల అటు అభిమానులతో పాటు ఇటు జట్టు సభ్యులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బాధలో ఉన్న భారత క్రికెటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓదార్చారు. మ్యాచ్​ తర్వాత డ్రెస్సింగ్ రూమ్​కు వెళ్లిన ఆయన.. జట్టు సభ్యులను మోటివేట్​ చేస్తూ.. వాళ్లల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నించారు.

ఓటమనేది సాధారణమైనది, దాన్ని చూసి నిరుత్సాపడకూడదని మోదీ అన్నారు. అంతే కాకుండా ఈ మెగా టోర్నీలో రోహిత్​ సేన వరుసగా పది మ్యాచ్‌లను గెలిచిన తీరును వారికి గుర్తుచేశారు. దేశమంతా చూస్తోంది.. దయచేసి నవ్వండి అంటూ కోరారు. అప్పుడప్పుడు ఇలా జరగుతుందని కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లి చేతులు పట్టుకుని ఓదార్చారు. జట్టులోని సభ్యులు ఒకరినొకరు ఎప్పుడూ ప్రోత్సహించుకోవాలని అన్నారు. మిగతా ప్లేయర్లకు కరచాలనం ఇచ్చి అభినందించారు. షమీని హగ్​ చేసుకుని ఓదార్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అంతకుముందు ట్విట్టర్​ వేదికగా భారత జట్టును ఉద్దేశించి ఓ పోస్ట్‌ పెట్టారు. "ప్రియమైన టీమ్‌ఇండియా.. ప్రపంచకప్‌లో మీ ప్రతిభ, పట్టుదల గుర్తుంచుకోదగ్గవి. మీరు గొప్ప ప్రదర్శనతో దేశాన్ని గర్వపడేలా చేశారు. ఈ రోజు, ఎల్లప్పుడూ మీకు మద్దతుగా ఉంటాం" అంటూ రోహిత్ సేనకు సపోర్ట్​ చేశారు.

Shami On Team India Loss : ఇక టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్​ షమీ కూడా ట్విట్టర్​ వేదికగా ఓటమి పట్ల స్పందించాడు. నిన్నటి రోజు మనది కాకుండా పోయిందని.. కానీ అంతకు రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ టీమ్​ఇండియా పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్​ చేశాడు. అందులో ప్రధాని నరేంద్ర మోదీ తనను ఓదార్చుతున్న ఫొటో జతచేసి.. "దురదృష్టవశాత్తూ.. నిన్న మన రోజు కాదు. టోర్నమెంట్ మొత్తంలో మన జట్టుకు, నాకు మద్దతుగా నిలిచినందుకు భారతీయులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి మా ఉత్సాహాన్ని పెంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. మేము తిరిగి పుంజుకుంటాము" అని రాసుకొచ్చాడు.

  • Unfortunately yesterday was not our day. I would like to thank all Indians for supporting our team and me throughout the tournament. Thankful to PM @narendramodi for specially coming to the dressing room and raising our spirits. We will bounce back! pic.twitter.com/Aev27mzni5

    — 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) November 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఫ్యాన్స్​ అందరికీ సేమ్​ డౌట్!- రోహిత్-విరాట్​ గమనం ఎటో?

షమీ వికెట్ల మ్యాజిక్​ - మ్యాక్స్​వెల్​ ఫాస్టెస్ట్ సెంచరీ - ప్రపంచకప్​లో టాప్ 10 హైలైట్స్ ఇవే!

World Cup 2023 Final : వన్డే ప్రపంచకప్​ ఫైనల్ భాగంగా జరిగిన భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్​లో ఆస్ట్రేలియాదే పై చేయిగా నిలిచింది.హోరా హోరీగా జరిగిన మ్యాచ్​లో టీమ్ఇండియా ప్లేయర్లు తమ శాయశక్తులా పోరాడినప్పటికీ.. విజయం కంగారూలనే వరించింది. దీంతో టీమ్ఇండియా డీలా పడింది. వరుస విజయాలతో సూపర్ ఫామ్​లో ఉన్న ఆ జట్టు.. ఇలా ఫైనల్స్​లో ఓటమి పాలవ్వడం పట్ల అటు అభిమానులతో పాటు ఇటు జట్టు సభ్యులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బాధలో ఉన్న భారత క్రికెటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓదార్చారు. మ్యాచ్​ తర్వాత డ్రెస్సింగ్ రూమ్​కు వెళ్లిన ఆయన.. జట్టు సభ్యులను మోటివేట్​ చేస్తూ.. వాళ్లల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నించారు.

ఓటమనేది సాధారణమైనది, దాన్ని చూసి నిరుత్సాపడకూడదని మోదీ అన్నారు. అంతే కాకుండా ఈ మెగా టోర్నీలో రోహిత్​ సేన వరుసగా పది మ్యాచ్‌లను గెలిచిన తీరును వారికి గుర్తుచేశారు. దేశమంతా చూస్తోంది.. దయచేసి నవ్వండి అంటూ కోరారు. అప్పుడప్పుడు ఇలా జరగుతుందని కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లి చేతులు పట్టుకుని ఓదార్చారు. జట్టులోని సభ్యులు ఒకరినొకరు ఎప్పుడూ ప్రోత్సహించుకోవాలని అన్నారు. మిగతా ప్లేయర్లకు కరచాలనం ఇచ్చి అభినందించారు. షమీని హగ్​ చేసుకుని ఓదార్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అంతకుముందు ట్విట్టర్​ వేదికగా భారత జట్టును ఉద్దేశించి ఓ పోస్ట్‌ పెట్టారు. "ప్రియమైన టీమ్‌ఇండియా.. ప్రపంచకప్‌లో మీ ప్రతిభ, పట్టుదల గుర్తుంచుకోదగ్గవి. మీరు గొప్ప ప్రదర్శనతో దేశాన్ని గర్వపడేలా చేశారు. ఈ రోజు, ఎల్లప్పుడూ మీకు మద్దతుగా ఉంటాం" అంటూ రోహిత్ సేనకు సపోర్ట్​ చేశారు.

Shami On Team India Loss : ఇక టీమ్ఇండియా స్టార్ పేసర్ మహ్మద్​ షమీ కూడా ట్విట్టర్​ వేదికగా ఓటమి పట్ల స్పందించాడు. నిన్నటి రోజు మనది కాకుండా పోయిందని.. కానీ అంతకు రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ టీమ్​ఇండియా పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్​ చేశాడు. అందులో ప్రధాని నరేంద్ర మోదీ తనను ఓదార్చుతున్న ఫొటో జతచేసి.. "దురదృష్టవశాత్తూ.. నిన్న మన రోజు కాదు. టోర్నమెంట్ మొత్తంలో మన జట్టుకు, నాకు మద్దతుగా నిలిచినందుకు భారతీయులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చి మా ఉత్సాహాన్ని పెంచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. మేము తిరిగి పుంజుకుంటాము" అని రాసుకొచ్చాడు.

  • Unfortunately yesterday was not our day. I would like to thank all Indians for supporting our team and me throughout the tournament. Thankful to PM @narendramodi for specially coming to the dressing room and raising our spirits. We will bounce back! pic.twitter.com/Aev27mzni5

    — 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) November 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఫ్యాన్స్​ అందరికీ సేమ్​ డౌట్!- రోహిత్-విరాట్​ గమనం ఎటో?

షమీ వికెట్ల మ్యాజిక్​ - మ్యాక్స్​వెల్​ ఫాస్టెస్ట్ సెంచరీ - ప్రపంచకప్​లో టాప్ 10 హైలైట్స్ ఇవే!

Last Updated : Nov 21, 2023, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.