ETV Bharat / sports

సచిన్ రికార్డులపై కోహ్లీ కన్ను.. మరో సెంచరీ చేస్తే టాప్ లిస్టులోకి..

author img

By

Published : Jan 10, 2023, 12:31 PM IST

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సచిన్ తెందూల్కర్​ రికార్డులపై కన్నేశాడు. శ్రీలంకతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌లో శతకాలు బాదితే.. సచిన్ రికార్డులను అధిగమించనున్నాడు.

Virat Sachin Records On Srilanka
Virat Kohli Sachin Tendulkar

మంగళవారం అసోం గువాహటిలోని బర్సపరా క్రికెట్ స్టేడియంలో జరిగే వన్డేలో దాసున్ షనక సారథ్యంలోని శ్రీలంక జట్టుతో రోహిత్ సేన తలపడనుంది. సీనియర్​ ఆటగాళ్లు రోహిత్​, విరాట్​ సారథ్యంలో టీమ్​ బరిలోకి దిగనుంది. ఇకపోతే ఈ మ్యాచ్​లో అందరి దృష్టి విరాట్​పైనే ఉంది. ఎందుకంటే క్రికెట్​ దిగ్గజం సచిన్​ పేరిట ఉన్న పలు రికార్డులను విరాట్​ బద్దలు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 1214 రోజుల సుదీర్ఘమైన విరామం తర్వాత వన్డేల్లో 44వశతకం బాది రికార్డు సృష్టించిన విరాట్​.. మళ్లీ ఈ వన్డేలో సెంచరీ చేసి శ్రీలంకతో సచిన్​కు ముడి పడి ఉన్న రికార్డును అధిగమిస్తాడా అని క్రికెట్​ లవర్స్ ఎదురుచూస్తున్నారు. చివరగా 2019లో వెస్టిండీస్​తో వన్డే ఆడిన విరాట్ తన 43వ సెంచరీ చేశాడు. ఇక 2022 డిసెంబరులో బంగ్లాదేశ్​తో జరిగిన వన్డే సిరీస్​లో లాంగ్​ గ్యాప్​ తర్వాత 44వ సెంచరీని నమోదు చేశాడు. ఇక మరోసారి కోహ్లీ 50 ఓవర్ల ఫార్మాట్‌లో క్రికెట్​ దిగ్గజం సచిన్ తెందూల్కర్​ పేరు మీద ఉన్న మరో అరుదైన రికార్డును బ్రేక్​ చేస్తాడా అనేది వేచి చూడాలి. కోహ్లీ వన్డే క్రికెట్‌లో చివరిసారిగా చేసిన సెంచరీతో ఆస్ట్రేలియన్​ బ్యాటింగ్ దిగ్గజం రికీ పాంటింగ్‌ రికార్డును అధిగమించాడు.

సచిన్​ సరసన నిలుస్తాడా..?
స్వదేశంలో జరిగిన వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు(20) సాధించిన క్రికెట్​ లెజెండ్​ సచిన్​ తెందూల్కర్​. ఇకపోతే భారత మాజీ కెప్టెన్ కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో 19 సెంచరీలు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. సచిన్​ క్రియేట్​ చేసిన మార్క్​ను అందుకొవడానికి కేవలం ఒక్క సెంచిరీ దూరంలో ఉన్నాడు విరాట్​ కోహ్లీ. శ్రీలంకతో ఆడే మొదటి మ్యాచ్​లో కోహ్లి మూడు అంకెలను చేరుకుంటే గనుక స్టార్ బ్యాటర్ తెందూల్కర్​పై ఉన్న భారీ రికార్డును సమం చేస్తాడు. అలాగే మరో శతకం చేయగలిగితే విరాట్​ ప్రపంచ రికార్డును బ్రేక్ చేయడం ఖాయం. సచిన్ తెందూల్కర్​ స్వదేశంలో 164 వన్డేలు ఆడి 20 సెంచరీలు చేశాడు. కోహ్లి భారత్​లో 101 వన్డేల్లో పాల్గొని 19 సెంచరీలను నమోదు చేశాడు. మొత్తంగా కోహ్లీ వన్డే క్రికెట్‌లో 12,471 పరుగులు చాశాడు.

180 పరుగుల దూరంలో..
వన్డేల్లో ఆల్ టైమ్ బెస్ట్​ రన్నర్స్​గా పేరొందిన టాప్ 5లో చేరాలంటే అతడు ఇంకా 180 పరుగులు చేయాల్సి ఉంది. తెందూల్కర్​, కుమార సంగక్కర, రికీ పాంటింగ్, సనత్ జయసూర్య, మహేల జయవర్ధనే తర్వాత కోహ్లీ ఈ జాబితాలో చేరనున్నాడు.

8 శతకాలు ఈ జట్టుపైనే..
వన్డే క్రికెట్‌లో శ్రీలంక జట్టుపైనే కోహ్లి, తెందూల్కర్​లు 8 సెంచరీలు సాధించడం విశేషం. 50 ఓవర్ల ఫార్మాట్‌లో శ్రీలంకపై తెందూల్కర్, కోహ్లీల మినహా ఇన్ని శతకాలు సాధించిన ప్లేయర్​ లేడు. బ్యాటింగ్ దిగ్గజం తెందూల్కర్ శ్రీలంకపై 84 వన్డేల్లో 3,113 పరుగులు చేశాడు. 1996 ప్రపంచకప్​ గెలిచిన శ్రీలంకపై ఇప్పటి వరకు 47 వన్డే మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 2,220 పరుగులు చేశాడు. కోహ్లీ శ్రీలంకపై 19 యాభై కంటే ఎక్కువ స్కోర్లు నమోదు చేశాడు.

ఈ సిరీస్‌లో కోహ్లి సెంచరీ చేస్తే, ఒక జట్టుపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ తెందూల్కర్​ సరసన నిలిచి రికార్డును సమం చేసే అవకాశం ఉంది. వెస్టిండీస్, ఆస్ట్రేలియాపై వరుసగా 9 సెంచరీలు చేసిన కోహ్లీ తెందూల్కర్​తో సమానమైన స్థానంలో నిలవనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.