ETV Bharat / sports

రంజీ ట్రోఫీలో ఫుల్ జోష్.. తొలిరోజు సెంచరీల మోత

author img

By

Published : Feb 17, 2022, 6:04 PM IST

Ranji Trophy 2022: రంజీ ట్రోఫీకి అద్భుతమైన ప్రారంభం లభించింది. తొలిరోజే సెంచరీల మోత మోగింది. సీనియర్లతో పాటు యువ బ్యాటర్లు చెలరేగారు. దీంతో శతకాలు నమోదయ్యాయి.

Ranji Trophy 2022:
రంజీ ట్రోఫీ

Ranji Trophy 2022: రంజీ ట్రోఫీ ఈ సీజన్ తొలిరోజు ఆట పూర్తయింది. ఆటగాళ్లు తమదైన శైలిలో అదరగొట్టారు. తొలిరోజే బ్యాట్స్​మెన్​ సెంచరీల మోత మోగించారు. ఈ జాబితాలో అండర్​-19 ప్రపంచకప్​ కెప్టెన్​ యష్ ధూల్​, యువక్రికెటర్​ సర్ఫరాజ్​ ఖాన్​తో పాటు గత కొంతకాలంగా పేలవ ఫామ్​తో ఇబ్బంది పడుతున్న సీనియర్​ ఆటగాళ్లు మనీశ్​ పాండే, టెస్టు స్పెషలిస్ట్​ రహానెలు కూడా ఉన్నారు.

తొలి రోజు ఆటముగిసే సమయానికి..

  • మణిపుర్​తో మ్యాచ్​లో అరుణాచల్​ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్​లో​ 119 పరుగులకు ఆలౌట్​ కాగా మణిపూర్​ 33 ఓవర్లకు ఒక వికెట్​ కోల్పోయి 95 పరుగులు చేసింది.
  • బంగాల్​తో మ్యాచ్​లో బరోడా 181 పరుగులకే ఆలౌట్​ అయింది. మరోవైపు బంగాల్​ 13 ఓవర్లలో 24 పరుగులు చేసి ఒక వికెట్​ కోల్పోయింది.
  • మిజోరంతో మ్యాచ్​లో బిహార్​ 90 ఓవర్లలో 325 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. బబుల్​ కుమార్​ (123*), ఎస్​ గనీ (136*) సెంచరీలు బాది బిహార్​ జట్టు స్కోరును పరుగులు పెట్టించారు.
  • చండీగఢ్​ చీతాస్​తో తలపడిన హైదరాబాద్​ జట్టు 7 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది.
  • ఝార్ఖండ్​ను 169 పరుగులకు కట్టడి చేసిన ఛత్తీస్​గఢ్​ జట్టు.. ఆ తర్వాత నాలుగు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది.
  • తమిళనాడుతో మ్యాచ్​లో దిల్లీ ఏడు వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది.
  • నాగాలాండ్​తో మ్యాచ్​లో సిక్కిం జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది.
  • రాజస్థాన్​ను 275 పరుగులకు ఆలౌట్​ చేసిన ఆంధ్రా జట్టు.. అనంతరం రెండు వికెట్లు కోల్పోయి 75 పరుగులు చేసింది.
  • అసోంతో జరిగిన మ్యాచ్​లో మహారాష్ట్ర జట్టు 5 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది.
  • గోవా-ఒడిశా మ్యాచ్​లో 181 పరుగులకే గోవా ఆలౌట్​ కాగా.. ఒడిశా స్కోరు 23-3గా ఉంది.
  • మధ్యప్రదేశ్​ జట్టు గుజరాత్​పై 7 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.
  • హరియాణాతో మ్యాచ్​లో త్రిపుర జట్టు స్కోరు 327-4గా ఉంది.
  • పంజాబ్​పై హిమాచల్​ ప్రదేశ్​ 324 పరుగులు చేసింది. ఈ జట్టు ఆరు వికెట్లు కోల్పోయింది.
  • జమ్మకశ్మీర్​-పుదుచ్చేరి మ్యాచ్​లో పుదుచ్చేరి టీమ్​ ఆరు వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది.
  • కర్ణాటకపై రైల్వేస్​ స్కోరు 392-5గా ఉంది.
  • మేఘాలయాతో మ్యాచ్​లో కేరళ జట్టు, ప్రత్యర్థిని 148కు ఆలౌట్​ చేసింది. అనంతరం ఒక వికెట్​ నష్టానికి 205 పరుగులు చేసి 57 పరుగుల అధిక్యంలో ఉంది.
  • సౌరాష్ట్రతో మ్యాచ్​లో ముంబయి మూడు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది.
  • సర్వీసెస్​ను 176కే ఆలౌట్​ చేసిన ఉత్తరాఖండ్.. ఒక వికెట్​ నష్టానికి 25 పరుగులు చేసింది.
  • విదర్భాపై ఉత్తర్​ప్రదేశ్​ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది.

ఇదీ చూడండి : రోడ్​ సేఫ్టీ సిరీస్​ రెండో సీజన్​ త్వరలో ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.