ETV Bharat / sports

ఒలింపిక్స్​లో క్రికెట్​- ఐసీసీ 'భారత్​ ఫ్యాన్స్'​ అస్త్రం!

author img

By

Published : May 23, 2021, 4:43 PM IST

జెంటిల్​మన్​ గేమ్​ క్రికెట్​ను ఒలింపిక్స్​లో చేర్చాలన్న ప్రతిపాదనపై అంతర్జాతీయ క్రికెట్ మండలి ఓ డాక్యుమెంట్​ను రూపొందించినట్టు తెలుస్తోంది. క్రికెట్​ను చేర్చడం కోసం భారత ఉపఖండంలోని అభిమానులను బలమైన కారణంగా చూపిస్తోంది.

olympics, cricket
ఒలింపిక్స్, క్రికెట్

ఒలింపిక్స్​ అంటే ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులకు పండగే. కానీ ఇందులో ఆ క్రీడ లేకపోవడం క్రికెట్​ అభిమానులను కలచివేస్తోంది. మరి అలాంటి మెగా ఈవెంట్​లో క్రికెట్​ను కూడా చేరిస్తే ఇక ఒలింపిక్స్​కే సరికొత్త ఊపు వస్తుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో 2028 లాస్​ ఏంజెల్స్​లో జరగనున్న ఒలింపిక్స్​లో క్రికెట్​ను చేర్చేందుకు కృషి చేస్తోంది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). మరి ''అంత పెద్ద మెగా ఈవెంట్​లో క్రికెట్​ను ఎందుకు చేర్చాలి?'' అన్న ప్రశ్నకు భారత ఉపఖండంలోని అభిమానులను కారణంగా చూపిస్తోంది ఐసీసీ.

క్రికెట్​ను ఒలింపిక్స్​లో చేర్చాలంటూ ఓ డాక్యుమెంటరీని ఐసీసీ రూపొందించినట్టు తెలుస్తోంది. భారత్​లో.. 2019 ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్​ వీక్షణల సంఖ్యను 2016లో రియోలో జరిగిన ఒలింపిక్స్​ వీక్షణల సంఖ్యతో పోల్చింది ఐసీసీ. క్రికెట్ వరల్డ్​కప్​ 54.5 కోట్ల మందిని ఆకర్షించగా.. ఒలింపిక్స్​ 19.1 కోట్ల మంది మాత్రమే చూశారని పేర్కొంది. ఇక ఒలింపిక్స్​ను వీక్షించే వారి సగటు వయసు 53 కాగా.. క్రికెట్​ను వీక్షించే చూసే వారి సగటు వయసు 34 ఏళ్లని తెలిపింది. 2019 ప్రపంచకప్​లో 18-32 ఏళ్ల మధ్య వయస్కులే 32శాతం మంది ఉన్నారని వివరించింది. 87శాతం మంది క్రికెట్​ అభిమానులు.. క్రీడను ఒలింపిక్స్​లో చూడాలని ఆశిస్తున్నట్టు పేర్కొంది.

క్రికెట్​ను ఒలింపిక్స్​లో చేర్చడం ద్వారా అదనంగా ఆదాయం చేకూరడమే కాకుండా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. క్రికెట్​లో మొత్తం 104సభ్య దేశాలు ఉండగా.. వాటిలో 92 అసోసియేట్ దేశాలు, మిగిలినవి శాశ్వత సభ్య దేశాలు. క్రికెట్ కనుక లాస్​ ఏంజెల్స్ ఒలింపిక్స్​లో భాగమైతే.. అసోసియేషన్ దేశాలకు ఆర్థికంగా కొంత మద్దతు దొరుకుతుంది. ఒలింపిక్స్​లో క్రికెట్​ ఉండాలని సచిన్​ వంటి దిగ్గజాలు ఇప్పటికే అభిప్రాయపడ్డారు.

అయితే క్రికెట్​ను లాస్​ ఏంజెల్స్​ ఒలింపిక్స్​లో అదనపు క్రీడ కోటా కింద చేర్చాలి. 2020 టోక్యో ఒలింపిక్స్​తో పాటు 2024 ప్యారిస్​ ఒలింపిక్స్​లో అదనపు క్రీడ కోటలో ఖాళీలు లేనందున క్రికెట్​ను చేర్చడానికి అవకాశం లేకుండా పోయింది.

గతంలో ఇలా..

గతంలో కౌలాలంపూర్​ వేదికగా జరిగిన 1998 కామన్వెల్త్​ క్రీడల్లో క్రికెట్​ను చేర్చారు. ఇందులో భారత జట్టులో సచిన్ తెందుల్కర్​తో పాటు అనిల్ కుంబ్లే, లక్ష్మణ్​ వంటి దిగ్గజాలు ఉన్నారు. ఇక 2022 బర్మింగ్​హామ్​ వేదికగా జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్​కు అవకాశం కల్పించారు.

ఏకైక సారి.. 121 క్రితం ఒలింపిక్స్​లో క్రికెట్​ ఆడారు. ఇంగ్లాండ్​, ఫ్రాన్స్​ ఆడాయి. ఇందులో ఇంగ్లాండ్ బంగారు పతకం కైవసం చేసుకోగా.. ఫ్రాన్స్​ వెండి పతకాన్ని దక్కించుకుంది.

ఇదీ చదవండి: రిటైర్మెంట్​ వార్తలపై టేలర్ క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.