ETV Bharat / sitara

సుశాంత్​ డ్రగ్​ కేసు: ముగ్గురిని అరెస్టు చేసిన ఎన్​సీబీ

author img

By

Published : Mar 8, 2021, 1:05 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ మృతికి సంబంధించిన డ్రగ్స్​ కేసులో ఎన్​సీబీ ముగ్గురిని అరెస్టు చేసింది. వీరిలో ఒకడు సుశాంత్​కు మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవాడని తెలిసింది. వీరి నుంచి అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్​ స్వాధీనం చేసుకున్నారు.

sushanth
సుశాంత్​

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​కు మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో అధికారులు. గోవాలో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఎన్​సీబీకి చెందిన ఓ అధికారి తెలిపారు. వారి నుంచి భారీ మొత్తంలో డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మృతికి సంబంధించి డ్రగ్స్‌ కేసులో ఎన్​సీబీ(మాదకద్రవ్య నియంత్రణ సంస్థ) మార్చి 5(శుక్రవారం)న ఛార్జిషీట్ దాఖలు చేసింది. 33 మంది పేర్లతో ప్రత్యేక కోర్టుకు దానిని సమర్పించింది. 200 మంది సాక్షుల వాంగ్మూలాలను ఇందులో జోడించింది. సుశాంత్‌ ప్రేయసి రియా చక్రవర్తితోపాటు మాదకద్రవ్యాలు సరఫరా చేసే పలువురి పేర్లు ఈ ఛార్జిషీట్‌లో నమోదు చేసినట్లు సమాచారం.

గతేడాది జూన్‌లో తన నివాసంలో సుశాంత్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన‌ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డ్రగ్స్‌ కోణంలోనూ విచారణ చేపట్టారు. రియా చక్రవర్తి, ఆమె సోదరుడితోపాటు పలువురిని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్‌ అగ్ర నటీనటులు, దర్శక నిర్మాతల పేర్లు తెరపైకి వచ్చాయి.

ఇదీ చూడండి: సుశాంత్ కేసు ఛార్జిషీట్​లో 33 మంది పేర్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.