ETV Bharat / sitara

Defamation case: నటుడు విజయ్​ సేతుపతిపై పరువు నష్టం దావా

author img

By

Published : Dec 5, 2021, 10:31 PM IST

Defamation case: ప్రముఖ తమిళ నటుడు విజయ్​ సేతుపతిపై పరువు నష్టం దావా వేశాడు మహా గాంధీ అనే వ్యక్తి. విమానాశ్రయంలో కలిసిన సందర్భంలో తనను అవమానించాడని, మేనేజర్​తో దాడి చేయించాడని పిటిషన్​లో పేర్కొన్నాడు.

Defamation case
విజయ్​ సేతుపతిపై పరువు నష్టం దావా

Defamation case: ప్రముఖ నటుడు విజయ్​ సేతుపతిపై పరువు నష్టం కేసు నమోదైంది. తమిళనాడు, చెన్నైకి సమీపంలోని సైదాపెట్​కు చెందిన మహా గాంధీ అనే వ్యక్తి దావా వేశారు.

" వైద్య పరీక్షల కోసం వెళుతూ.. మైసూర్​ విమానాశ్రయంలో విజయ్​ సేతుపతిని అనుకోకుండా కలిశాను. సినీ రంగంలో ఆయన విజయాలకు మెచ్చుకున్నాను. కానీ, నా ప్రశంసలను తీసుకోలేదు. నన్ను అవమానించాడు. విమానాశ్రయంలోనే కులం పేరుతో దూషించాడు. అతని మేనేజర్​తో నాపై దాడి చేయించాడు. ఆ మరుసటి రోజున తనపై దాడి జరిగిందిన కట్టుకథ అల్లాడు. విజయ్​ సేతుపతి మేనేజర్​ దాడి చేయటం వల్ల నా వినికిడి శక్తి కోల్పోయాను. " అని పిటిషన్​లో పేర్కొన్నారు మహా గాంధీ అనే వ్యక్తి.

విజయ్​ సేతుపతితో పాటు అతని మేనేజర్​ జాన్సన్​పైనా పరువు నష్టం దావా వేశాడు మహా గాంధీ.

ఇదీ చూడండి: vijay sethupathi : విజయ్ సేతుపతిని తంతే రూ.1001 అంటూ ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.