ETV Bharat / sitara

సేతుపతి-నిహారిక సినిమా.. మూడేళ్ల తర్వాత తెలుగులోకి

author img

By

Published : Feb 26, 2021, 4:56 PM IST

Updated : Feb 26, 2021, 6:14 PM IST

మెగా డాటర్ నిహారిక నటించిన తమిళ సినిమాను, దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగులోకి తీసుకురానున్నారు. ఫస్ట్​లుక్​ను విడుదల చేసిన చిత్రబృందం.. విడుదల తేదీని కూడా వెల్లడించింది.

after three years, vijay sethupathi-niharika movie into telugu
విజయ్ సేతుపతి నిహారిక

నటి నిహారిక కొణిదెల కథానాయికగా నటించిన తమిళ చిత్రం 'ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్'. ఆరుముగ కుమార్‌ దర్శకుడు. విజయ్‌ సేతుపతి కీలకపాత్రలో నటించారు. 2018లో విడుదలై, బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు అందుకున్న ఈ చిత్రాన్ని.. మూడేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. 'ఓ మంచి రోజు చూసి చెప్తా' టైటిల్​తో అనువదిస్తున్నారు.

after three years, vijay sethupathi-niharika movie into telugu
ఓ మంచి రోజు చూసి చెప్తా సినిమాలో విజయ్ సేతుపతి-నిహారిక

మార్చి 19న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు. అపోల్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెలుగులో విడుదల చేయనున్నారు. జస్టిన్‌ ప్రభాకరన్ స్వరాలు అందించారు.

Last Updated : Feb 26, 2021, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.