ETV Bharat / priya

మటన్‌తో పసందైన కశ్మీరీ బిర్యానీ చేద్దామిలా!

author img

By

Published : Nov 1, 2020, 1:01 PM IST

చిన్నా, పెద్దా అంతా ఇష్టంగా తినేది బిర్యానీ. చికెన్ అయినా మటన్ అయినా బిర్యానీ వంటకానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. మరి మటన్​తో తయారుచేసిన కశ్మీరీ రకం బిర్యానీ రుచి చూడాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వంటకం తయారీ విధానాన్ని చూసేయండి.

mutton biryani
మటన్‌తో పసందైన కశ్మీరీ బిర్యానీ చేద్దామిలా!

ఘుమఘుమలాడే మటన్ బిర్యానీ కశ్మీరీ స్టైల్​లో చేసుకుంటే రుచికరమే కాదు, ఎంతో సులభం కూడా.

కావలసినవి:

మటన్‌: ముప్పావు కిలో, బాస్మతీ బియ్యం: కిలో, పెరుగు: 2 టీస్పూన్లు, సొంటి పొడి: టీస్పూను, యాలకులపొడి: పావుటీస్పూను, నెయ్యి: కప్పు, కెవ్రా ఎసెన్స్‌: పావుటీస్పూను, కుంకుమ పువ్వు: 2 గ్రా., కారం: 2 టీస్పూన్లు, ఇంగువ: చిటికెడు, గరం మసాలా: 2 టీస్పూన్లు, సోంపుపొడి: 2 టీస్పూన్లు, పంచదార: పావుటీస్పూను, పలావు ఆకులు: రెండు, ఉప్పు: రుచికి సరిపడా

తయారుచేసే విధానం:

  • బాణలిలో నెయ్యి వేసి కాగాక ఇంగువ, మటన్‌ ముక్కలు వేసి ఓ రెండు నిమిషాలు వేయించాలి. అందులోనే పెరుగు కూడా వేసి కలిపి రంగుమారే వరకూ వేగనివ్వాలి. ఇప్పుడు ఉప్పు, కారం, సొంటి పొడి, పలావు ఆకు వేసి కాసేపు వేయించాలి. తరవాత అరలీటరు నీళ్లు పోయాలి. అరటీస్పూను గరంమసాలా, టీస్పూను సోంపు పొడి వేసి సిమ్‌లో ఉడికించి దించాలి. మటన్‌ ముక్కల్ని విడిగా ఓ గిన్నెలో వేసి ఉంచాలి. అదే బాణలిలో రెండు లీటర్ల నీళ్లు పోసి ఉప్పు వేయాలి.
  • ఇప్పుడు గరంమసాలా మిగిలిన సోంపు పొడి అన్నీ పలుచని బట్టలో మూట కట్టి నీళ్లలో వేయాలి. తరవాత బియ్యం వేసి సిమ్‌లో సగం ఉడికేవరకూ ఉంచి దించాలి. తరవాత అందులోనుంచి నీళ్లు వంపేసి మటన్‌ ముక్కలూ అన్నమూ పొరలు పొరలుగా మందపాటి గిన్నెలో వేసి మూతపెట్టి సిమ్‌లో దమ్‌ చేయాలి.

ఇదీ చదవండి: టేస్టీగా 'పెప్పర్‌ మష్రూమ్‌ మసాలా' రెసిపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.