ETV Bharat / jagte-raho

'దేవాలయంలో బంధించి.. పెట్రోల్​ పోసి నిప్పంటించి'

author img

By

Published : Nov 23, 2020, 10:42 PM IST

Updated : Nov 23, 2020, 10:54 PM IST

జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పవన్​ అనే సాఫ్ట్​వేర్ ఉద్యోగిని అతని బంధువులే సజీవ దహనం చేశారు. ఇటీవల మృతి చెందిన బావమరిది కుటుంబాన్ని పరామర్శించేందుకు రాగా ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.

'దేవాలయంలో బందించి.. పెట్రోల్​ పోసి నిప్పంటించి'
'దేవాలయంలో బంధించి.. పెట్రోల్​ పోసి నిప్పంటించి'

జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మల్యాల మండలం బల్వాంతపూర్‌ శివారులో ఉన్న మంజునాథ ఆలయ గదిలో.. హైదరాబాద్‌ అల్వాల్‌కు చెందిన పాగిళ్ల పవన్‌ అనే సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని బంధించారు. అనంతరం బంధువులే అతనిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. దీంతో పవన్ అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సజీవదహనంపై వివరాలు సేకరిస్తున్నారు. పవన్​ చిన్న బావమరిది ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు పవన్​ బల్వాంతపూర్​కు రాగా ఈ దారుణానికి ఒడిగట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి: మాటమాట పెరిగి.. కర్రలతో కొట్టుకున్నారు!

Last Updated : Nov 23, 2020, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.