ETV Bharat / international

Afghan refugees: దేశాన్ని వీడే అఫ్గాన్​ ప్రజల పరిస్థితేంటి?

author img

By

Published : Aug 22, 2021, 4:57 PM IST

కాబుల్​ విమానాశ్రయం, సరిహద్దులు అఫ్గాన్(Afghan news)​ ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. తాలిబన్ల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఇతర దేశాలకు పరుగులు తీస్తున్నారు. ఎలాగైనా దేశాన్ని వీడాలన్న లక్ష్యంతో ప్రజలు ఉన్నారు కానీ.. ఆ తర్వాత ఏంటి? అన్న దానిపై ఎలాంటి స్పష్టత లేదు. కొత్త ప్రాంతంలో తమకు చోటు దక్కుతుందా? అన్నది పట్టించుకోవడం లేదు. మరి అఫ్గాన్​ ప్రజలకు(Afghan refugees) ఆశ్రయమిచ్చే విషయంలో ఏ దేశం ఎలా వ్యవహరిస్తోంది?

Afghan refugees
అఫ్గాన్​ ప్రజలు

"తాలిబన్ల నుంచి విముక్తి పొందాలి.. ఎలాగైనా దేశాన్ని విడిచివెళ్లిపోవాలి.." లక్షలాది మంది అఫ్గాన్​ ప్రజల ఆలోచన ఇదే. ఇందుకోసం కొందరు కట్టుబట్టలతో విమానాశ్రయాలకు పరుగులు తీస్తుంటే.. మరికొందరు మూటలు నెత్తిమీద వేసుకుని.. దేశ సరిహద్దులను కాలినడకన దాటేస్తున్నారు. కాబుల్​ను తాలిబన్లు(Taliban news) ఆక్రమించినప్పటి నుంచి ఆ దృశ్యాలు అంతర్జాతీయ సమాజాన్ని కలచివేస్తున్నాయి. ప్రజల ఆర్థనాథాలు.. ప్రపంచ దేశాలకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.

కానీ ప్రజలు దేశాన్ని దాటడం ఒకెత్తు.. వెళ్లిన ప్రాంతంలో జీవించడం మరో ఎత్తు! ఎందుకంటే వారికి శరణార్థులుగా(Afghan refugees) గుర్తిస్తారు. అయితే అఫ్గాన్​ ప్రజలను ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. తగిన విధంగా సహాయం చేస్తామని హామీనిచ్చాయి. మరికొన్ని దేశాలు మాత్రం వారికి దూరంగా ఉంటున్నాయి. ఆ వివరాలు ఇలా..

Afghan refugees
పాకిస్థాన్​ సరిహద్దులో

శరణార్థులు అంటే ఎవరు?

"యుద్ధం, అశాంతి కారణంగా బలవంతంగా సొంత దేశాన్ని వీడిన వారు" శరణార్థులు అని నిర్వచనమిచ్చింది యూఎన్​హెచ్​సీఆర్​(యునైటెడ్​ నేషన్స్​ హైకమిషనర్​ ఫర్​ రెఫ్యూజీస్​).

దీని ప్రకారం ప్రపంచ శరణార్థుల్లోని 68 శాతం సిరియా, వెనుజువెలా, అఫ్గానిస్థాన్​, దక్షిణ సుడాన్​, మయన్మార్​ నుంచి వలస వెళ్లినవారేనని యూఎన్​హెచ్​​సీఆర్(unhcr Afghan refugees) డేటా చెబుతోంది. 2020 నాటికి 28 లక్షల మంది అఫ్గాన్​ ప్రజలు శరణార్థుల జాబితాలో చేరారు. ఇందులో 90 శాతం మంది ఇరాన్​, పాకిస్థాన్​లో ఆశ్రయం పొందుతున్నారు.

ఏ దేశంలో ఎలా...?

తాజా పరిణామాలతో.. అఫ్గాన్​ ప్రజలను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి. తమ వంత సహాయం చేస్తున్నాయి.

అమెరికా..

గత కొన్ని రోజులుగా దాదాపు 1,200మంది అఫ్గాన్​వాసులను(Afghan refugees in US) అక్కడి నుంచి తరలించింది అమెరికా. రానున్న రోజుల్లో ఆ సంఖ్య 3,500కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీరిలో కొంతమందికి వసతులు కల్పించేందుకు కూడా అగ్రరాజ్యం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం యూఎస్​ రెఫ్యూజీ అడ్మిషన్స్​ ప్రొగ్రాం(యూఎస్​ఆర్​ఏపీ)ను వినియోగించుకోనుంది.

మొత్తం మీద 10వేల మంది అఫ్గాన్​ ప్రజలను రక్షించేందుకు అగ్రరాజ్యం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Afghan refugees
కాబుల్​లో విమానం కోసం ఎదురుచూపులు

కెనడా..

20,000 అఫ్గాన్​వాసులకు ఆశ్రయమివ్వనున్నట్టు కెనడా ప్రకటించింది. ఈ సంఖ్యను పెంచే ఉద్దేశంతో ఉన్నట్టు అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.

యూకే..

5వేల మంది అఫ్గాన్​లను స్వాగతిస్తున్నట్టు బ్రిటన్​ ప్రకటించింది. నూతన పునరావాస కార్యక్రమంలో భాగంగా పిల్లలు, ఆడవారికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు పేర్కొంది.

Afghan refugees
కాబుల్​ విమానాశ్రయంలో రద్దీ

భారత్..

శరణార్థుల విషయంలో భారత దేశం ఎలాంటి విధానాలను అనుసరించడం లేదు. ఇన్నేళ్లు.. వేర్వేరు దేశాల్లోని సంక్షోభ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుని, చర్యలు చేపట్టింది. కానీ ప్రత్యేక వ్యవస్థ లేదు.

అయితే అఫ్గాన్​లో(Afghan refugees in India) తాజా పరిణామాల నేపథ్యంలో అక్కడి ప్రజల కోసం ఈ-వీసాలను ప్రవేశపెట్టింది. దేశంలోకి వారు అడుగుపెట్టే విధంగా త్వరితగతిన చర్యలు చేపట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది.

పాకిస్థాన్​..

అఫ్గానిస్థాన్​ను తాలిబన్లు ఆక్రమిస్తే.. తమ సరిహద్దులను మూసివేస్తామని ఈ ఏడాది జూన్​లోనే ప్రకటించారు పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​. కానీ తాజాగా అలాంటి నిర్ణయాలేవీ ఇమ్రాన్​ ప్రభుత్వం తీసుకోలేదు. ఫలితంగా సరిహద్దుల్లో భారీ ప్రవాహం కనపడుతోంది. కాలి నడకన ప్రజలు సరిహద్దులను దాటుతున్నారు.

Afghan refugees
అఫ్గాన్​- పాక్​ సరిహద్దు దాటుతూ..

ఈ నేపథ్యంలో వలస వస్తున్న వారి కోసం తాత్కాలిక క్యాంపులు ఏర్పాటు చేసే విధంగా సమగ్ర వ్యూహాల రచిస్తున్నట్టు పాక్(Afghan refugees in Pakistan)​ వెల్లడించింది.

ఇరాన్​..

అఫ్గాన్​ వలసదారులకు ఆశ్రయమిచ్చేందుకు మూడు రాష్ట్రాల్లో తాత్కాలిక క్యాంపులను ఏర్పాటు చేస్తోంది ఇరాన్​. అయితే.. అఫ్గాన్​ను వీడి తమ దేశంలోని వచ్చే ప్రజలను.. అక్కడ పరిస్థితులు చక్కబడిన వెంటనే పంపేస్తామని తేల్చిచెప్పింది.

ఉజ్బెకిస్థాన్​..

అఫ్గాన్​లో పరిస్థితులు ఎలా ఉన్నా.. తమకు ఏదీ పట్టనట్టుగా ప్రవర్తిస్తోంది పొరుగు దేశం ఉజ్బెకిస్థాన్​. కరోనా అని కారణంగా చెబుతూ.. మూసివేసిన సరిహద్దును ఇంకా తెరవలేదు. అఫ్గాన్​ ప్రజలు వీసాలు దాఖలు చేసినా.. అవి తిరస్కరణకే గురవుతున్నాయి.

టర్కీ..

టర్కీలోనూ పరిస్థితులు భిన్నంగా లేవు. వలసదారులను అడ్డుకునేందుకు టర్కీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే.. సరిహద్దు ప్రాంతమైన వాన్​లో.. అఫ్గాన్​ ప్రజలను నిర్బంధించింది.

అమెరికా అభ్యర్థన మేరకు.. తమ దేశంలోకి అఫ్గాన్​ ప్రజలను తగిన సంఖ్యల్లో అనుమతిచ్చేందుకు ఉత్తర మెకడొనియా, ఉగాండా, అల్బెనియా-కొసొవా అంగీకరించాయి.

Afghan refugees
అఫ్గాన్​ పిల్లలకు జవాన్ల రక్షణ

ఇదీ చూడండి:- Afghan crisis :మా పిల్లల్ని కాపాడండి.. కంచెల పైనుంచి విసిరేస్తున్న మహిళలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.