ETV Bharat / international

'సంఘర్షణను ముగిద్దాం- తాలిబన్లతో చర్చలు జరుపుదాం!'

author img

By

Published : Nov 11, 2021, 5:15 PM IST

అఫ్గానిస్థాన్​లో అధికారం చేపట్టిన తాలిబన్లతో (Pakistan meeting on Afghanistan) అంతర్జాతీయ సమాజం సంప్రదింపులు కొనసాగించి.. శాంతి, సుస్థిరతను నెలకొల్పాలని పాకిస్థాన్ సందేశమిచ్చింది. సుదీర్ఘ కాలంగా కొనసాగిన సంఘర్షణను ముగించేందుకు ప్రస్తుత పరిస్థితులను ఓ అవకాశంగా పేర్కొంది.

pakistan meeting on afghanistan
pakistan meeting on afghanistan

అఫ్గానిస్థాన్​లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చిన తాలిబన్లతో (Pakistan meeting on Afghanistan) అంతర్జాతీయ సమాజం సంప్రదింపులు కొనసాగించాలని (Troika Plus meeting) పాకిస్థాన్ పిలుపునిచ్చింది. అఫ్గాన్​లో శాంతి, సుస్థిరతను నెలకొల్పడం సహా.. సుస్థిరాభివృద్ధి సాధించేందుకు ఆ దేశంతో జరిపే చర్చలు ఉపకరిస్తాయని పేర్కొంది. అమెరికా, చైనా, రష్యా దేశాల ప్రతినిధులతో కలిసి అఫ్గాన్ అంశంపై చర్చలు (Pakistan meeting on Afghanistan) ప్రారంభించడానికి ముందు పాకిస్థాన్ ఈ మేరకు సందేశాన్ని ఇచ్చింది.

"అంతర్యుద్ధం తిరిగి రావాలని ఎవరూ కోరుకోరు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఎవరికీ అవసరం లేదు. సరికొత్త శరణార్థుల సంక్షోభాన్ని మనం నివారించాలని కోరుకుంటున్నాం. ప్రాంతీయ దేశాలన్నింటికీ అఫ్గాన్ సమస్యపై ఆందోళన ఉంది. ఆ దేశంలో శాంతి, సుస్థిరత విషయంపై ఒకే విధమైన ఆలోచనలు ఉన్నాయి."

-షా మహమ్మద్ ఖురేషీ, పాకిస్థాన్ విదేశాంగ మంత్రి

అఫ్గానిస్థాన్​లో ఉగ్రవాద సమస్యను సమర్థంగా పరిష్కరించాలని పేర్కొన్నారు ఖురేషీ. పొరుగు దేశంగా.. నాలుగు దశాబ్దాల పాటు సంక్షోభం, అస్థిరత తాలూకు మంటలను తాము అనుభవించామని అన్నారు. సుదీర్ఘ కాలంగా కొనసాగిన సంఘర్షణను ముగించేందుకు ప్రస్తుత పరిస్థితులను ఓ అవకాశంగా అభివర్ణించారు.

pakistan meeting on afghanistan
విదేశీ ప్రతినిధులతో ఖురేషీ

ఖురేషి అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి తాలిబన్ ప్రభుత్వ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాకీ నేతృత్వంలోని బృందం సైతం హాజరైంది. అమెరికా తరపున హాజరైన థామస్ వెస్ట్ సహా ఇతర దేశాల ప్రతినిధులు సైతం.. ముత్తాకీతో భేటీ కానున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.