ETV Bharat / international

దూకుడు పెంచిన ఇరాన్​- యురేనియం శుద్ధి షురూ

author img

By

Published : Jan 4, 2021, 6:15 PM IST

ఇరాన్​ తన ప్రణాళిక ప్రకారమే ఫోర్దోలోని అణుకేంద్రంలో 20శాతం యురేనియం శుద్ధిని ప్రారంభించింది. అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయుధ శ్రేణి స్థాయిని 90శాతానికి పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Iran says it begins 20% uranium enrichment amid US tensions
గేరు మార్చిన ఇరాన్​- యురేనియం శుద్ధి షురూ

ఫోర్దోలోని నేలమాళిగలో ఉన్న అణు కేంద్రంలో యురేనియం శుద్ధిని ప్రారంభించినట్లు ఇరాన్​ తెలిపింది. ఈ మేరకు అధ్యక్షుడు హసన్ రౌహానీ ఆదేశాలు జారీ చేసినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయుధ శ్రేణి స్థాయిని 90 శాతానికి పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

దశాబ్దం క్రితమే యురేనియాన్ని 20 శాతం వరకు శుద్ధి చేయాలని ఇరాన్​ నిర్ణయించింది. దీనిపై అప్పట్లో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. దాదాపు యుద్ధం జరిగినంత పనైంది. 2015లో ఇరాన్​కు పశ్చిమ దేశాలతో అణు ఒప్పందం ఖరారు కాగా పరిస్థితి సద్దుమణిగింది. అయితే ఈ ఒప్పందం నుంచి 2018లో అమెరికాలోని డొనాల్డ్​ ట్రంప్​ సర్కారు వైదొలిగింది. దీంతో రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్​పై ఆంక్షలు విధించింది అగ్రరాజ్యం.

ఈ నేపథ్యంలో ఆంక్షల నుంచి ఉపశమనం కోసం ఐరోపాపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్​ పార్లమెంటు.. యురేనియం శుద్ధి స్థాయిని పెంచాలని ఒక బిల్లును ఇటీవల ఆమోదించింది. దీనికి అనుగుణంగా 20 శాతం వరకు యురేనియాన్ని శుద్ధి చేయాలని ఇరాన్​ తాజాగా నిర్ణయించింది. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) తనిఖీదారులకూ ఈ విషయాన్ని తెలియజేసింది.

ఇదీ చూడండి: జాక్​ మా ఎక్కడ?.. 2 నెలలుగా బిలియనీర్ అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.