ETV Bharat / international

విరిగిపడ్డ కొండచరియలు.. బురదలో కూరుకుపోయి 14 మంది మృతి

author img

By

Published : Feb 9, 2022, 7:34 AM IST

Colombia Mudslide: పశ్చిమ కొలంబియాలో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి చెందారు. 35 మంది గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

Colombia Mudslide
కొలంబియాలో భారీ వర్షాలు

కొలంబియాలో భారీ వర్షాలు

Colombia Mudslide: పశ్చిమ కొలంబియాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పెరరీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడడం కారణంగా అక్కడ ఉన్న నివాస ప్రాంతాలను బురద ముంచెత్తింది. బురదలో కూరుకుపోయి 14 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఒకరి ఆచూకీ గల్లంతైనట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారని, క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు.

ఈ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఇంకా ఉందని చెప్తున్నారు అధికారులు. మరింత ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ప్రజలు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోవాలని సూచించారు. జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు.

మృతుల కుటుంబాలకు కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ సంతాపం తెలిపారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి: హ్యుందాయ్‌ 'కశ్మీర్‌' ట్వీట్‌ వివాదం.. దక్షిణ కొరియా ప్రభుత్వం ఏమందంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.