ETV Bharat / international

'ఉగ్రవాదంపై గళమెత్తేందుకు భారత్​ వెనకాడదు'

author img

By

Published : Jan 5, 2021, 5:21 AM IST

మానవాళికే శత్రువులుగా భావించే ఉగ్రవాదం వంటి సమస్యలపై గళమెత్తేందుకు భారత్​ ఎన్నడూ వెనకాడదని ఐరాసలోని భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి వెల్లడించారు. ఐరాస భద్రతా మండలిలో.. అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకుగా భారత్​ వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. భద్రతామండలిలో చేరనున్న తాత్కాలిక దేశాల ఫ్లాగ్‌ మార్చ్‌ కార్యక్రమంలో పాల్గొన్న తిరుమూర్తి ఈ మేరకు వ్యాఖ్యానించారు.

India will not shy away from raising its voice against enemies of humanity like terrorism: Tirumurti
'ఉగ్రవాదంపై గళమెత్తేందుకు భారత్​ వెనకాడదు'

అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్​ గొంతుకులాగా నిలబడుతుందని ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో భారత శాశ్వత రాయబారి టీఎస్​ తిరుమూర్తి వెల్లడించారు. మానవాళికే శత్రువులుగా భావించే ఉగ్రవాదం వంటి వాటిపై గళమెత్తేందుకు భారత్​ వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలకు మానవ కేంద్రంగా పరిష్కరించేందుకు ఐరాస భద్రతా మండలిలోని తన పదవీకాలాన్ని భారత్​ ఉపయోగించుకుంటుందని పేర్కొన్నారు. భద్రతామండలిలో చేరనున్న తాత్కాలిక దేశాల ఫ్లాగ్‌ మార్చ్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భద్రతా మండలిలో భారత్​ చేరింది. బహుపాక్షికత, న్యాయ నిబంధనలు, అందరికీ సమానమైన అంతర్జాతీయ శాంతిభద్రతల వ్యవస్థ, అభివృద్ధికు భారత్​ కట్టుబడి ఉంది. కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు మేమందరం ఒక్కటిగా ఐకమత్యంతో నిలబడతాం. అంతర్జాతీయ శాంతిభద్రల సమ్యలకు మానవ కేంద్రంగా సాగే పరిష్కారాలను తీసుకొచ్చేందుకు భద్రతా మండలిలోని పదవీకాలాన్ని భారత్​ ఉపయోగించుకుంటుంది. మానవాళికే శత్రువులుగా భావించే ఉగ్రవాదం వంటి వాటిపై పోరాడేందుకు గళమెత్తడానికి భారత్​ వెనకడుగు వేయదు. ప్రపంచం ఓ వసుదైక కుటుంబం అనే సిద్ధాంతాన్ని అనుసరించేందుకు భారత్​ కృషి చేస్తుంది."

--- టీఎస్​ తిరుమూర్తి, ఐరాసలో భారత శాశ్వత రాయబారి.

ఐక్యరాజ్యసమితి(ఐరాస) భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్​ ఈ నెల 1న కొత్త అధ్యాయం ప్రారంభించింది. రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగనుంది.

ఇదీ చూడండి:- భారత్​-బంగ్లా సరిహద్దులో అక్రమ చొరబాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.