ETV Bharat / entertainment

'రంగమార్తాండ' రిలీజ్​కు ప్లాన్​.. 'పంచతంత్ర కథలు' సాంగ్​

author img

By

Published : Jun 26, 2022, 7:36 PM IST

'పంచతంత్ర కథలు' సినిమాలోని 'నేనేమో మోతవరి' అంటూ సాగే పాటను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. ఇది శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది. మరోవైపు దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం 'రంగమార్తాండ'ను ఆగస్టులో రిలీజ్​ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

Rangamartanda movie
రంగమార్తాండ సినిమా

తరుణ్​భాస్కర్​

TarunBhaskar Panchatantra kathalu song: నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్ ప్రధాన పాత్రల్లో ఐదు వేరు వేరు కథలతో యువ దర్శకుడు గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన చిత్రం 'పంచతంత్ర కథలు'. మధు క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంలోని తొలి పాటను ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. 'నేనేమో మోతవరి' అంటూ సాగే ఈ పాటకు కమ్రాన్ సంగీతాన్ని అందించగా రామ్ మిర్యాల ఆలపించారు. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. ఆద్యంతం యువతను ఆకట్టుకునేలా ఈ పాట విశేషంగా ఆదరణ పొందనుందని తరుణ్ భాస్కర్ తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Rangamarthanda Movie: నటులు ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలో దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం 'రంగమార్తాండ'. మరాఠీలో విజయవంతమైన 'నటసామ్రాట్‌'కు రీమేక్‌గా రూపొందింది. అయితే కొంతకాలం క్రితం.. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్న సమయంలో అనివార్య కారణాల వల్ల నిలిచిపోయింది. ఇప్పుడీ సినిమాకు ఎట్టకేలకు మోక్షం కలిగిందట. మళ్లీ షూటింగ్​ ప్రారంభించి మిగిలిన భాగాన్ని త్వరగా పూర్తి చేయాలని మేకర్స్​ ప్లాన్​ చేస్తున్నారట. ఆగస్టులో థియేటర్లలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారని తెలిసింది. ఓటీటీ నుంచి కూడా మంచి ఆఫర్స్​ వస్తున్నాయని సమాచారం. కాగా, రంగస్థల కళాకారుల జీవితాల చుట్టూ అల్లుకున్న ఆసక్తికర కథాంశంతో ఈ మూవీని రూపొందిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆ షార్ట్​ఫిల్మ్​కు 513 అవార్డులు.. గిన్నిస్​లో చోటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.