ETV Bharat / crime

ఘోర ప్రమాదం... ట్రాక్టర్ బోల్తాపడి ఆరుగురు మృతి

author img

By

Published : Dec 7, 2022, 10:49 PM IST

Updated : Dec 7, 2022, 10:59 PM IST

Six People died in tractor overturn at laxmaiahpuram, chittoor district
ఘోర ప్రమాదం... ట్రాక్టర్ బోల్తాపడి ఆరుగురు మృతి

22:46 December 07

ట్రాక్టర్ బోల్తాపడి ఆరుగురు మృతి, పలువురికి గాయాలు

Six People died in tractor overturn ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పూతలపట్టు మండలం లక్ష్మయ్యవూరులో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తాపడి ఆరుగురు మృతిచెందారు. ఇంకా 17 మందికి తీవ్ర గాయలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను తిరుపతి స్విమ్స్‌, వేలూరు సీఎంసీకి తరలించారు.

ట్రాక్టర్‌పై పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ట్రాక్టర్‌లో 26 మంది బలిజపల్లి గ్రామస్థులు పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు ఐరాల మండలం బలిజపల్లికి చెందినవారుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి:

Last Updated : Dec 7, 2022, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.