ETV Bharat / crime

Vanasthalipuram Theft Case : సైకిల్​పై పగలు రెక్కీ.. తాళం వేసి ఉన్న ఇళ్లలో రాత్రిపూట చోరీ

author img

By

Published : Feb 14, 2022, 2:11 PM IST

Vanasthalipuram Theft Case: మూణ్నెళ్ల క్రితం హైదరాబాద్ వనస్థలిపురం పరిధిలోని పలు ఇళ్లలో దొంగతనం చేసిన దుండగుల్లో ఇద్దరు దొంగలను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. పట్టపగలు సైకిల్​పై తిరుగుతూ రెక్కీ నిర్వహించి.. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రిపూట చోరీలకు పాల్పడ్డారని రాచకొండ సీపీ మహేశ్​భగవత్​ తెలిపారు. వీరిపై తమిళనాడు, బంగాల్​లో కేసులున్నాయని.. కేరళలోనూ దొంగతనానికి పాల్పడ్డారని చెప్పారు.

Vanasthalipuram Theft Case
Vanasthalipuram Theft Case

Vanasthalipuram Theft Case : హైదరాబాద్‌ వనస్థలిపురం పరిధిలోని పలు ఇళ్లల్లో మూణ్నెళ్ల క్రితం దొంగతనం జరిగిన కేసులో ఇద్దరు దొంగలను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు నిర్వహించామని.. తమిళనాడు, బంగాల్‌లో వారిపై కేసులు ఉన్నట్లు తేలిందని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ఇద్దరు నిందితులపై 14 కేసులు ఉన్నాయని వెల్లడించారు. వారిద్దరిపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేస్తామన్నారు.

సైకిల్​పై తిరుగుతూ రెక్కీ..

Accused Arrest in Vanasthalipuram Theft : నిందితులు ఇద్దరు.. పగలు సైకిల్‌పై తిరుగుతూ.. తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తారని.. రాత్రి వేళ దొంగతనాలకు పాల్పడతారని భగవత్ చెప్పారు. బంగాల్‌ పోలీసుల సాయంతో దొంగల నుంచి సొత్తు రికవరీ చేశామని తెలిపారు.

Vanasthalipuram Theft Case Updates : 'మూడు నెలల క్రితం వనస్థలిపురం పీఎస్ పరిధిలోని ఇళ్లల్లో చోరీ జరిగింది. వేలి ముద్రలు సేకరించి రాష్ట్రంలోని డేటాబేస్​తో పోల్చి చూస్తే సరిపోలలేదు. జాతీయ డేటాబేస్​తోనూ సరిపోలకపోవడం వల్ల ఈ కేసు సవాల్​గా మారింది. క్షుణ్నంగా దర్యాప్తు చేస్తే.. ఈ దొంగతనం చేసిన వారిపై తమిళనాడు, పశ్చిమబంగాల్​లో పెటీ కేసులున్నట్లు తేలింది. ప్రత్యేక బృందాలతో వారికోసం వేట షురూ చేశాం. హయత్​నగర్ మండలం​లోని సాహెబ్​నగర్​లో నిందితులు ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నట్లు గుర్తించాం. వీళ్లిద్దరు బంగాల్​కు చెందినవారే.

బంగారం విక్రయించేది అక్కడే

దొంగతనం చేసిన తర్వాత రైల్లో వెళ్లి పశ్చిమ బెంగాల్​లో బంగారం విక్రయిస్తున్నారు. ఆ రాష్ట్ర పోలీసుల సాయంతో బంగారం రికవరీ చేశాం. వీరిపై 14 కేసులున్నాయి. 11 రాచకొండ, 2 సూర్యాపేట, ఒక దొంగతనం రాజేంద్రనగర్​ పీఎస్​ పరిధిలో జరిగింది. కేవలం తెలంగాణలోనే కాకుండా కేరళ, తమిళనాడులోనూ వీళ్లు చోరీలకు పాల్పడ్డారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. వీళ్లని తొలిసారిగా పట్టుకుంది రాచకొండ పోలీసులే.

- మహేశ్​భగవత్, రాచకొండ సీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.