ETV Bharat / crime

Shilpa Chowdary Cheating Case: శిల్పాచౌదరికి 14 రోజుల రిమాండ్, కాల్ డేటాపై పోలీసుల దృష్టి

author img

By

Published : Dec 15, 2021, 12:14 PM IST

Updated : Dec 15, 2021, 3:40 PM IST

Shilpa Chowdary Cheating Case: శిల్పాచౌదరికి ఉప్పర్‌పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ... ఆమె బెయిల్ పిటిషన్​పై విచారణను వాయిదా వేసింది. అనంతరం ఆమెను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. తొలుత ఆమెకు గోల్కొండ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.

Shilpa Chowdary Cheating Case, Shilpa case updates
శిల్పాచౌదరిని ఉప్పర్‌పల్లి కోర్టుకు తరలించిన పోలీసులు

Shilpa Chowdary Cheating Case: పెట్టుబడుల ముసుగులో కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పాచౌదరికి ఉప్పర్‌పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆమె బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. అనంతరం శిల్పాచౌదరిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. తొలుత ఆమెకు గోల్కొండ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. హెల్త్ చెకప్ అనంతరం ఆమెను... ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. కాగా తనపై వచ్చిన ఆరోపణలన్నీ ఫేక్ అని ఆమె అనడం గమనార్హం.

శిల్పాచౌదరిని ఉప్పర్‌పల్లి కోర్టుకు తరలించిన పోలీసులు

బ్యాంకు లాకర్​ను తనిఖీ

శిల్పా చౌదరి పోలీస్ కస్టడీ ఇటీవలె ముగిసింది. మూడు రోజుల కస్టడీ అనంతరం... మళ్లీ ఒక రోజు కస్టడీలోకి తీసుకున్నారు. అందులోభాగంగా పోలీసులు ఆమె బ్యాంకు లాకర్​ను తనిఖీ చేశారు. కోకాపేట్​లోని యాక్సిస్ బ్యాంకులో ఉన్న శిల్పా చౌదరి ఖాతాను బ్యాంకు అధికారుల సమక్షంలో పోలీసులు తనిఖీ చేశారు. లాకర్​లో ఏమీ లభించకపోవడంతో తిరిగి నార్సింగి ఎస్ఓటీ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఇతరుల నుంచి కోట్ల రూపాయలు తీసుకున్న శిల్పా వాటిని ఎక్కడికి మళ్లించిందనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

శిల్ప వివరాలు సేకరించిన పోలీసులు

Shilpa bank accounts: శిల్ప బ్యాంకు ఖాతాలో పెద్దగా నగదు లేకపోవడంతో… లాకర్లపై పోలీసులు దృష్టి పెట్టారు. వాటిల్లోనూ ఏమీ లభించలేదని పోలీసులు తెలిపారు. నార్సింగి పీఎస్​లో ఆమెపై 3కేసులు నమోదు చేశారు. రూ. 7కోట్లు తీసుకొని మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దాదాపు 30 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ డబ్బంతా ఎక్కడికి మళ్లించిందనే వివరాలను సేకరిస్తున్నారు.

పక్కా ప్రణాళిక ప్రకారమేనా?

shilpa frauds: శిల్ప పక్కా ప్రణాళిక ప్రకారం మోసం చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ మోసం గురించి బయటపడినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకూడదనే ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు శిల్పతో పాటు.... ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో ఇద్దరూ కలిసి ఎక్కువగా ఎవరితో మాట్లాడారు... వాళ్లకు వీళ్లకు సంబంధం అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. శిల్పా చౌదరితో వ్యాపార సంబంధాలు నెరిపిన వాళ్ల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 15, 2021, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.