ETV Bharat / crime

Manchirevula farm house case: ప్రముఖుల మెప్పు కోసం నోరూరించే వంటకాలు.. సకల సౌకర్యాలు..

author img

By

Published : Nov 3, 2021, 10:08 PM IST

మంచిరేవుల ఫామ్​ హౌస్​ పేకాట కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. కస్టడీలో ఉన్న ప్రధాన నిందితుడు గుత్తా సుమన్(Manchirevula farm house case)​ను నార్సింగి పోలీసులు విచారిస్తున్నారు. దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖులను(Manchirevula farm house case)​ ఆకర్షించేందుకు పేకాట శిబిరంలో రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేస్తాడని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

Manchirevula farm house case, guttha suman
మంచి రేవుల ఫామ్​ హౌజ్​ కేసు

రెస్టారెంట్లకు, హోటళ్లకు కస్టమర్లను ఆకర్షించేందుకు వినసొంపైన సంగీతం, ఆకర్షణీయమైన వంటకాలు, సకల సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లుగా.. పేకాట శిబిరాలకు ప్రముఖులను ఆకర్షించేందుకు రుచికరమైన వంటలను గుత్తా సుమన్(Manchirevula farm house case)​​ ఏర్పాటు చేస్తాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలోని మంచిరేవుల ఫామ్​ హౌస్​ పేకాట కేసులో ప్రధాన నిందితుడు గుత్తా సుమన్(Manchirevula farm house case)​​ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల కస్టడీలో భాగంగా చర్లపల్లి జైలు నుంచి గుత్తా సుమన్​ను కస్టడీలోకి తీసుకున్న నార్సింగి పోలీసులు.... ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నార్సింగి ఠాణా తీసుకొచ్చి అక్కడి నుంచి మాదపూర్ ఎస్ఓటీ కార్యాలయానికి తీసుకెళ్లి ప్రశ్నిస్తున్నారు.

రుచికరమైన వంటకాలతో

పేకాట కేసులో గుత్తా సుమన్... నిర్వహణ పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు నార్సింగి పోలీసుల ప్రాథమిక దర్యాప్తు(Manchirevula farm house case)​లో తేలింది. ప్రముఖులను ఆకర్షించడానికి పలు రుచికరమైన వంటలతో పాటు... చేపల కూర వెరైటీలను భోజనంలో వడ్డిస్తాడని... పేకాట శిబిరంలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడని పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు. సుమన్​పై గచ్చిబౌలి పీఎస్​లోనూ పేకాట కేసు(Manchirevula farm house case)​ నమోదైంది. పంజాగుట్ట, కూకట్ పల్లి పోలీస్ స్టేషన్లలో మోసం చేసిన కేసులు నమోదయ్యాయి. ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలోనూ సుమన్​పై కేసులున్నాయి.

సంబంధిత వార్త: Naga shaurya farm house case: 'పేకాడదాం రండి'.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులకు ఆహ్వాన కార్డులు

పరిచయాలపై ఆరా

సుమన్ ఎక్కడెక్కడ పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారనే విషయాలను నార్సింగి పోలీసులు(Manchirevula farm house case)​ తెలుసుకుంటున్నారు. ఫామ్ హౌస్​ యజమాని నుంచి శివలింగ ప్రసాద్ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నారు. రెంటల్ అగ్రిమెంట్ తీసుకురావాలని శివలింగ ప్రసాద్​కు నార్సింగి పోలీసులు సూచించారు. శివలింగప్రసాద్​కు గుత్తా సుమన్​కు గల పరిచయాలపైనా నార్సింగి పోలీసులు(Manchirevula farm house case)​ ఆరా తీస్తున్నారు. జన్మదిన వేడుకల కోసం ఫామ్ హౌస్​ను ఒక రోజు అద్దెకు తీసుకున్నట్లు గుత్తా సుమన్ పోలీసులకు తెలిపారు.

ఇదీ చదవండి: Bandi Sanjay: రేపటి నుంచే రాష్ట్రమంతా దళితబంధు అమలు చేయాలి.. లేదంటే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.