ETV Bharat / crime

Shilpa Fraud: పార్టీలు ఇచ్చి ఆకర్షించి.. కోట్లలో వసూలు చేసి..

author img

By

Published : Nov 27, 2021, 11:58 AM IST

Updated : Nov 27, 2021, 2:33 PM IST

Shilpa fraud Tollywood Celebrities: అధిక వడ్డీలు ఇస్తానని నమ్మించి రూ.కోట్లలో వసూలు చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. పార్టీలు ఇచ్చి, అధిక వడ్డీలు ఇస్తానని చెప్పి శిల్ప బాధితులను ఆకర్షించినట్లు తెలుస్తోంది.

Shilpa fraud Tollywood Celebrities, business wooman fraud tollywood celebrities, shilpa arrest
సెలబ్రెటీలను మోసం చేసిన శిల్ప

Shilpa fraud: మోసం చేయడమే ఆమె లక్ష్యం. భార్య చేసే మోసాలకు వత్తాసు పలకడమే భర్త లక్షణం. అధిక వడ్డీలు, వ్యాపారాల్లో లాభాల పేరిట వల వేసి.. వారి నుంచి కోట్లలో డబ్బులు తీసుకుని.. విలాసవంతమైన జీవితాన్ని గడపడమే ఆ దంపతుల ధ్యేయం. అలా మోసాలకు పాల్పడిన శిల్పా చౌదరి (Shilpa fraud) గుట్టు ఎట్టకేలకు బయటపడింది. హైదరాబాద్​కు చెందిన వ్యాపారవేత్త శిల్పను, ఆమె భర్త శ్రీనివాస్​ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. కోటి 5లక్షల రూపాయల తీసుకొని తిరిగి ఇవ్వలేదని దివ్య అనే మహిళ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Shilpa fraud Tollywood Celebrities, business wooman fraud tollywood celebrities, shilpa arrest
సెలబ్రెటీలను మోసం చేసిన శిల్ప

గండిపేట సిగ్నేచర్ విల్లాస్‌లో నివాసం ఉంటున్న శిల్ప, ఆమె భర్తను అదుపులోకి తీసుకొని నార్సింగి పోలీసులు ప్రశ్నించారు. ఆమె బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. దివ్య నుంచి కోటికి పైగా నగదు తీసుకున్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు తిరిగి చెల్లించకపోవడంతో శిల్ప, ఆమె భర్తను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మాదాపూర్​ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

నార్సింగ్ పరిధిలో శిల్ప చిట్టీలపేరుతో మోసం చేశారు. శిల్ప, శ్రీనివాస్‌ ప్రసాద్‌ దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాం. నార్సింగ్‌ పీఎస్‌లో శిల్పపై దివ్య ఫిర్యాదు చేశారు. దివ్య నుంచి రూ.1.05 కోట్లు శిల్ప తీసుకున్నారు. గ్రేటర్ కమ్యూనిటీల్లో కిట్టీపార్టీలో శిల్పకు దివ్య పరిచయమైంది. రియల్‌ ఎస్టేట్‌, సినిమాల్లో పెట్టుబడి పేరుతో శిల్ప డబ్బులు వసూలు చేసేవారు. శిల్ప సహేరి అనే సినిమా తీసింది. శిల్పపై పలువురు బాధితులు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.

-డీసీపీ వెంకటేశ్వర్లు

శిల్పను పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తామని డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. బాధితులెవరైనా నార్సింగ్ పీఎస్‌లో ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. బాధితుల్లో ప్రముఖులు లేరని స్పష్టం చేశారు. శిల్ప చేస్తున్న మోసాలు భర్త శ్రీనివాస్‌ ప్రసాద్‌కు తెలుసని.. ఇద్దరిపై ఛీటింగ్ కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

విలాసవంతమైన జీవితం కోసం

శిల్పా చౌదరి విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి మోసాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తనను వ్యాపారవేత్తగా పరిచయం చేసుకుని కోట్లలో మోసాలు చేసినట్లు అనుమానిస్తున్నారు. వచ్చిన డబ్బుతో ఇద్దరు కలిసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని వెల్లడించారు. అధిక వడ్డీ ఇస్తానని, వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తానని నమ్మించి.. మోసాలకు పాల్పడేవారని డీసీపీ తెలిపారు. బాధితులను ఆకర్షించేందుకు పేజ్​ త్రీ పార్టీలు ఇచ్చి కోట్లలో కుచ్చుటోపీ పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దంపతుల బాధితుల సంఖ్య పూర్తిగా తేలేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: Thief Arrest in Hyderabad : హైదరాబాద్​లో గజదొంగ అరెస్టు.. 180 తులాల బంగారం స్వాధీనం

Last Updated : Nov 27, 2021, 2:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.