ETV Bharat / city

Somu Veerraju On Liquor Prices: చీప్​ లిక్కర్​ రూ.50కే అమ్మాలి: భాజపా ఏపీ అధ్యక్షుడు

author img

By

Published : Dec 31, 2021, 4:45 PM IST

Updated : Dec 31, 2021, 5:20 PM IST

Somu Veerraju On Liquor Prices: లిక్కర్ ధరలపై భాజపా ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేదల కోసం చీప్‌ లిక్కర్‌ రూ.50కే అమ్మాలన్న సోము.. అలా అమ్మితే కుటుంబానికి ఏడాదికి రూ.2 లక్షలు మిగులుతాయన్నారు.

somu verraju on liquor prices
Somu Veerraju

Somu Veerraju On Liquor Prices: ఏపీలో అధికారంలోకి వస్తే లిక్కర్​ను రూ. 70కే విక్రయిస్తామంటూ చేసిన వ్యాఖ్యలను భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సమర్థించుకున్నారు. పేదవాడిని దృష్టిలో పెట్టుకునే తాను ఈ వ్యాఖ్యలు చేశానన్నారు. రూ.6 బాటిల్​​ను రూ.250లకు అమ్మడాన్ని భాజపా ప్రోత్సహించదని వ్యాఖ్యానించారు. పేదల కోసం చీప్ లిక్కర్​ను రూ. 50కే అమ్మాలని డిమాండ్ చేశారు. రూ.50కి చీప్ లిక్కర్ అమ్మితే కుటుంబానికి ఏడాదికి రూ.2 లక్షలకు పైగా మిగులుతాయన్నారు. తనను సారాయి వీర్రాజు అన్నవారు ఏం తాగుతారో తనకు తెలుసునని ఎద్దేవా చేశారు.

గుంటూరు జిన్నా టవర్ పేరు మార్చాల్సిందేనని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఏపీలో భాజపా అధికారంలోకి వచ్చాక.. జిన్నా టవర్ పేరు మారుస్తామన్నారు. విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రి పేరునూ మార్చాలన్నారు.

రూ.6 మద్యం బాటిల్​.. 250 రూపాయలకు అమ్ముతారా?. రోజుకు రెండు బాటిళ్లు తాగితే.. ఏడాదికి 2 లక్షల రూపాయలకు పైగా ఖర్చవుతుంది. ఈ లెక్క ముందు జగన్​ ఇచ్చే కానుకలెంత. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కోసం మహిళలంతా ఉద్యమం చేయాలి. విద్యార్థులకు కుళ్లిపోయిన కోడిగుడ్లు పెడుతున్నారు. భాజపా అధికారంలోకి వచ్చాక.. ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగుల చేత నాటు కోళ్ల ఫారాలు పెట్టిస్తాం. గుంటూరులో జిన్నా టవర్​ను తొలగించాలి. దవళేశ్వరం బ్యారేజీకి... కాటన్​ మాదిరిగా ఇంజినీర్​ వీణం వీరన్న పేరు పెట్టాలి. వీరన్న పేరునూ హైలెట్​ చెయ్యాలి. విశాఖలో కింగ్​ జార్జి హాస్పిటల్​ (కేజీహెచ్​)కు తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న పేరు పెట్టాలి. మీరు పేర్లు మార్చకపోతే.. భాజపా అధికారంలోకి వచ్చాక పెడతాం.

- సోము వీర్రాజు, భాజపా ఏపీ అధ్యక్షుడు

వైరల్​గా మారిన సోమూ వ్యాఖ్యలు..

విజయవాడలో ఈనెల 28న జరిగిన భాజపా ప్రజాగ్రహ సభలో సోము వీర్రాజు పలు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను కోటి ఓట్లతో గెలిపిస్తే.. లిక్కర్​ను రూ.70కే విక్రయిస్తామని ప్రకటించారు. ఏపీ రెవెన్యూ మెరుగ్గా ఉంటే రూ.50కే విక్రయిస్తామని పేర్కొన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. మంత్రి కేటీఆర్ కూడా సోము వీర్రాజు వ్యాఖ్యలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Somu Veerraju On Liquor Prices: చీప్​ లిక్కర్​ రూ.50కే అమ్మాలి: భాజపా ఏపీ అధ్యక్షుడు

ఇదీచూడండి: KTR tweet on Somu Veerraju: వావ్.. వాట్ ఎ స్కీం.. వాట్ ఎ షేమ్.. సోము వీర్రాజుపై కేటీఆర్​ సెటైర్​!

Last Updated : Dec 31, 2021, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.