ETV Bharat / city

అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతి

author img

By

Published : Dec 20, 2020, 1:38 PM IST

Updated : Dec 20, 2020, 2:56 PM IST

అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతి
అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతి

13:36 December 20

అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి కేంద్రం అనుమతి

తెలుగు రాష్ట్రాలు సహా మొత్తం 5 రాష్ట్రాలు అదనపు రుణాలు పొందేందుకు అనుమతులిచ్చింది కేంద్ర ఆర్థికశాఖ. ఫలితంగా ఆయా రాష్ట్రాలు రూ. 16,728కోట్లు అదనంగా పొందనున్నాయి. సులభతర వాణిజ్య సంస్కరణలను అమలు చేసినందుకు ఈ వెసులుబాటు కల్పించింది.  తెలంగాణ​, ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలు అదనంగా రూ.16,728 కోట్ల రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అంగీకరించింది. నిర్దేశించిన సులభతర వాణిజ్య సంస్కరణలను పూర్తి చేసిన కారణంగా ఆయా రాష్ట్రాలు ఈ వెసులుబాటును కల్పించింది. అదనపు రుణాలను పొందేందుకు సులభతర వాణిజ్యంలో తాము తీసుకొచ్చిన సంస్కరణలను అమలు చేయాలని ఈ ఏడాది మే నెలలో సూచించింది ఆర్థికశాఖ. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్​ అదనపు రుణాలు పొందేందుకు అర్హత సాధించాయి. 

ఫలితంగా రూ.2,508 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు రాష్ట్రానికి అనుమతి లభించింది. రూ.2,525 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు ఏపీకి వెసులుబాటు కల్పించింది. 

ఇవీ చూడండి: డిసెంబర్​ ప్రథమార్థంలో పెరిగిన విద్యుత్తు వాడకం

Last Updated : Dec 20, 2020, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.