ETV Bharat / city

'అధిక ధరలకు విక్రయిస్తే ఆ నంబర్​కు కాల్​ చేయండి'

author img

By

Published : Mar 23, 2020, 11:16 PM IST

లాక్​డౌన్​.. ఈ మాట ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తుంటే.. టోకు, చిల్లర వర్తకులకు మాత్రం కాసులు తెచ్చిపెట్టే అవకాశంగా మారింది. రైతుబజార్లు, మార్కెట్లు వద్ద రేట్ల పట్టిక చూసిన సామాన్యుడు బెంబేలెత్తిపోయాడు. అధిక ధరలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పరిస్థితిని ముందే అంచనా వేసిన ప్రభుత్వం టోకు, చిల్లర వర్తకులకు హెచ్చరికలు జారీ చేసింది.

అదును చూసి ధరలు పెంచితే అంతే..
high prices

టోకు, చిల్లర వర్తకులకు పౌరసరఫరాలశాఖ అధికారులు హెచ్చరించారు. లాక్‌డౌన్‌ రోజుల్లో నిత్యావసరాల ధరలు పెంచవద్దని హైదరాబాద్‌ చీఫ్‌ రేషనింగ్ అధికారిణి బాలమాయాదేవి ఆదేశించారు. అదనుచూసి ధరలు పెంచితే వర్తకులపై కఠిన చర్యలు తప్పవన్నారు. మాస్క్‌లు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌లను ఎక్కువ రేటుకు విక్రయిస్తే వారిపై వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు.

లాక్​డౌన్​ నేపథ్యంలో బ్లాక్​ మార్కెట్​ను అరికట్టెందుకు 040- 23447770 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులపై సత్వర స్పందనకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి: కరోనా ​జీవితకాల సవాల్-​ మీడియా ప్రముఖులతో వీసీలో మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.