ETV Bharat / business

అక్టోబర్ చివరికి నాటికి 15వ ఆర్థిక సంఘం నివేదిక రెడీ

author img

By

Published : Oct 28, 2020, 7:42 PM IST

15వ ఆర్థిక సంఘం 2021-26 కాలానికి సంబంధించిన నివేదికను ఈ నెల 30 లోపు సిద్ధం చేయనుంది. అనంతరం ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.

planning commission
ఆర్థిక సంఘం

2021-2026 కాలానికి 15వ ఆర్థిక సంఘం ఈ నెల 30లోపు తన నివేదికను సిద్ధం చేయనుంది. ఈ దిశగా కమిషన్‌ పని చేస్తోందని కేంద్ర ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. నివేదికను సిద్ధం చేసిన అనంతరం 15వ ఆర్థిక సంఘం దాన్ని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.

నివేదిక తుది రూపు సంతరించుకోనున్న నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్​కే సింగ్‌.. సంఘం మాజీ ఛైర్మన్లు సి.రంగరాజన్‌, విజయ్‌ కేల్కర్‌లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నివేదిక తయారీకి సంఘం చేసిన కృషిని ఈ ఇద్దరు మాజీ ఛైర్మన్‌లు ప్రశంసించారు.

కరోనా మహమ్మారి విజృంభణ, ఆర్థిక వ్యవస్ధపై దాని ప్రభావం మధ్య 15వ ఆర్థిక సంఘం అనేక సవాళ్లు ఎదుర్కొంటూ పని చేసిందని ప్రశంసలు కురిపించారు. 2021-26 కాలానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలపై 15వ ఆర్థిక సంఘం తన నివేదికలో సూచనలు, సలహాలు, ప్రతిపాదనలను పొందుపర్చనుంది.

ఇదీ చూడండి: 'ఆర్థిక సంఘానికి శాశ్వత హోదా ఇచ్చే ఆలోచన లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.