ETV Bharat / business

Satya Nadella: సత్య నాదెళ్లకు 'సీకే ప్రహ్లాద్'​ పురస్కారం

author img

By

Published : Oct 13, 2021, 11:16 AM IST

మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లకు(Satya Nadella News) ప్రతిష్ఠాత్మక సీకే ప్రహ్లాద్ 'గ్లోబల్ బిజినెస్​ సస్టెయినబిలిటీ లీడర్​షిప్​' అవార్డు వరించింది. కర్బన ఉద్గార రహిత కంపెనీగా మైక్రోసాఫ్ట్​ను తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషికి గాను అదే సంస్థకు చెందిన మరో ముగ్గురితో కలిసి నాదెళ్ల ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

Satya Nadella
సత్య నాదెళ్ల

ప్రతిష్ఠాత్మక సీకే ప్రహ్లాద్ 'గ్లోబల్ బిజినెస్​ సస్టెయినబిలిటీ లీడర్​షిప్' పురస్కారం 2021 ఏడాదికి గాను మైక్రోసాఫ్ట్ సీఈఓ(Microsoft Ceo), భారతీయ అమెరికన్ సత్యనాదెళ్లను(Satya Nadella News) వరించింది. అదే సంస్థకు చెందిన మరో ముగ్గురితో కలిసి ఈ అవార్డును ఆయన(Satya Nadella News) అందుకున్నారు. ప్రపంచ దేశాల్లో ప్రైవేట్ రంగంలో అసాధారణ విజయాలు, సుస్థిరత సాధించిన వారికి వ్యాపార దిగ్గజం భారతీయ అమెరికన్​ సీకే ప్రహ్లాద్ పేరిట ఈ​ పురస్కారాన్ని కార్పొరేట్ ఎకో ఫోరమ్(సీఈఎఫ్​) సంస్థ 2010 నుంచి అందిస్తోంది.

మైక్రోసాఫ్ట్ అధినేత, వైస్ ఛైర్మన్ బ్రాడ్ స్మిత్​, చీఫ్​ పైనాన్షియల్ ఆఫీసర్​ అమీ హుడ్, చీఫ్​ ఎన్విరాన్​మెంట్ ఆఫీసర్​ లుకాస్​ జొప్పాతో కలిసి సత్య నాదెళ్ల ఈ అవార్డును పంచుకున్నారు. 2030 నాటికి కర్బన ఉద్గార రహిత సంస్థగా మైక్రోసాఫ్ట్​ను తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషి గాను ఈ అవార్డు వారికి దక్కింది.

"నాదెళ్ల, హుడ్, స్మిత్, జుప్పా అద్భుతమైన యాజమాన్య పాత్ర పోషిస్తున్నారు. ఒకే సంస్థకు చెందిన నలుగురు వ్యక్తులు.. పర్యావరణ పరిరక్షణ దిశగా కృషి చేయడం ఇదే తొలిసారి" అని సీఈఎఫ్​ వ్యవస్థాపకుడు ఎంఆర్​ రంగస్వామి తెలిపారు. కార్పొరేట్ సంస్థల్లో నాయకత్వం ఎలా ఉండాలో అన్నదానికి సరికొత్త ఉదాహారణగా నిలిచారని చెప్పారు. మైక్రోసాఫ్ట్ వ్యాపార వ్యూహానికి స్థిరత్వమే ప్రధానమైన అంశాన్ని చాటి చెప్పారని పేర్కొన్నారు.

సీఈఎఫ్​ అడ్వైజరీ బోర్డులోని 24 మంది వేసిన ఓట్ల ద్వారా సీకే ప్రహ్లాద్ విజేతలను ఎంపిక చేసినట్లు సీఈఎఫ్​ తెలిపింది.

ఇదీ చూడండి: ఎయిర్​ ఇండియా విక్రయంతో ప్రైవేటీకరణకు మరింత ఊతం

ఇదీ చూడండి: నెట్‌ లేకున్నా డిజిటల్‌ చెల్లింపులు.. త్వరలో దేశవ్యాప్తంగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.