ETV Bharat / business

వాహనదారులకు పెట్రో మోత- మళ్లీ పెరిగిన ధరలు

author img

By

Published : Dec 6, 2020, 10:21 AM IST

Updated : Dec 6, 2020, 10:26 AM IST

వాహనదారులకు దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు మరోసారి షాకిచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను మళ్లీ పెంచాయి. ఇప్పటికే రెండేళ్ల గరిష్ఠాన్ని తాకిన పెట్రోల్ ధర.. ఆదివారం మరింత పెరిగింది.

Petrol price Hiked Again
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ఆదివారం 28 పైసలు పెరిగి.. రూ.83.41 వద్దకు చేరింది. డీజిల్ ధర లీటర్​కు 29 పైసలు పెరిగి.. రూ.73.62 వద్ద ఉంది.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలకు తగ్గట్లు.. చమురు మార్కెటింగ్ సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తుండటం ఇందుకు కారణం.

నవంబర్​ 20 నుంచి పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచటం ఇది 14వ సారి.

దేశవ్యాప్తంగా ఇతర మెట్రో నగరాల్లోనూ.. లీటర్​ పెట్రోల్ ధర 24 పైసల నుంచి అత్యధికంగా 29 పైసల వరకు పెరిగింది. డీజిల్ ధరను లీటర్​కు కనిష్ఠంగా 27 పైసల నుంచి గరిష్ఠంగా 32 పైసల వరకు పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.

ప్రధన నగరాల్లో ఇంధన ధరలు (లీటర్​కు)

నగరంపెట్రోల్డీజిల్
హైదరాబాద్రూ.86.71రూ.80.28
బెంగళూరురూ.86.16రూ.78
ముంబయిరూ.90.01రూ.80.20
చెన్నైరూ.86.21రూ.78.93
కోల్​కతారూ.84.86రూ.77.15

ఇదీ చూడండి:ఓ ఉద్యోగి నిష్క్రమణతో గూగుల్​లో దుమారం!

Last Updated : Dec 6, 2020, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.