ETV Bharat / business

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ నాలుగో డేటా సెంటర్‌

author img

By

Published : Mar 7, 2022, 3:44 PM IST

Updated : Mar 7, 2022, 7:37 PM IST

Microsoft Fourth Data Center in Hyderabad: హైదరాబాద్‌లో నాలుగో డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తామని మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. 2025 కల్లా డేటా సెంటర్ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ అని పేర్కొంది.

Microsoft
Microsoft

Microsoft Fourth Data Center in Hyderabad : హైదరాబాద్​లో రూ.15 వేల కోట్ల భారీ పెట్టుబడితో నూతన డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా ముందుకొచ్చింది. రాబోయే పదిహేనేళ్ల కాలంలో పూర్తి కానున్న ఈ డేటా సెంటర్.. మైక్రోసాఫ్ట్ కు దేశంలోనే అతిపెద్ద డేటాసెంటర్​గా నిలుస్తుందని కంపెనీ ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి ప్రకటించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని తమ క్యాంపస్​లో కేంద్ర ఐటీశాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కేటీఆర్ సమక్షంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.

ఐటీ రంగంలో రెండంకెల వృద్ధి..

పుణే, ముంబయి, చెన్నై నగరాల్లో మైక్రోసాఫ్ట్​కు ఇప్పటికే మూడు డేటా సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్​లో రానున్న ఈ నాల్గో డేటా సెంటర్ 2025 కల్లా ఫేజ్ వన్ పూర్తవుతుందని అనంత్ మహేశ్వరి తెలిపారు. దేశ డిజిటల్ అవసరాలు పెరుగుతోన్న నేపథ్యంలో క్లౌడ్, డేటా సెంటర్ల వినియోగానికి విస్తృత ప్రాధాన్యం ఏర్పడిందని కేంద్ర ఐటీశాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఏటా ఈ రంగం రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోందని.. దేశ క్లౌడ్, డిజిటల్ అవసరాలను తీర్చేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకు రావటం హర్షణీయమని కేంద్రమంత్రి అన్నారు.

పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడింగ్​లో విస్తృత అవకాశాలు

హైదరాబాద్​లో మైక్రోసాఫ్ట్​ డేటా​ సెంటర్​ను ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ​ఐటీ ఎగుమతుల్లో గతేడాదితో పోలిస్తే 12.8 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. పబ్లిక్ క్లౌడ్ ప్రొవైడింగ్​లో విస్తృత అవకాశాలున్నాయని.. మైక్రోసాఫ్ట్​లా కంపెనీలు వాటిని అందిపుచ్చుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి : రూ.2.56 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్

Last Updated : Mar 7, 2022, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.