ETV Bharat / business

బ్యాంకింగ్ షేర్లు భళా- మళ్లీ 40వేల పైకి సెన్సెక్స్

author img

By

Published : Nov 3, 2020, 3:47 PM IST

Updated : Nov 3, 2020, 5:08 PM IST

స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 503 పాయింట్లు పెరిగి.. తిరిగి 40 వేల మార్క్​పైకి చేరింది. నిఫ్టీ 144 పాయింట్ల లాభంతో స్థిరపడింది.

share markets update
నేటి స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల నుంచి తేరుకున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. మంగళవారం సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్ 503 పాయింట్లు బలపడి.. 40,261 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 144 పాయింట్ల వృద్ధితో 11,813 వద్దకు చేరింది.

బ్యాంకింగ్, ఫార్మ, ఆటో షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు మంగళవారం కూడా నష్టాల్లోనే ఉండటం వల్ల లాభాలు కాస్త పరిమితమైనట్లు తెలుస్తోంది.

స్టాక్​మార్కెట్లకు భారీ లాభాలు

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్ 40,355 పాయింట్ల అత్యధిక స్థాయి, 39,953 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,836 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 11,723 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్​బీఐ, పవర్​గ్రిడ్, హెచ్​డీఎఫ్​సీ, సన్​ఫార్మా, ఇండస్​ఇండ్ బ్యాంక్ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

ఎన్​టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్​యూఎల్, నెస్లే, హెచ్​సీఎల్​టెక్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, సియోల్, హాంకాంగ్ సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి.

రూపాయి, ముడి చమురు..

కరెన్సీ మార్కెట్లో రూపాయి మంగళవారం 74.41 వద్ద దాదాపు ఫ్లాట్​గా స్థిరపడింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 1.72 శాతం పెరిగింది. బ్యారెల్ ముడి చమురు ధర 39.64 డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ కొత్త స్మార్ట్​ఫోన్లు- ధర ఎంతంటే?

Last Updated : Nov 3, 2020, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.