ETV Bharat / bharat

బ్యాటరీ​ పేలి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

author img

By

Published : Mar 15, 2022, 10:51 PM IST

UPS battery bursts: యూపీఎస్​ బ్యాటరీ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యవాత పడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్​లో జరిగింది.

Woman, 2 daughters die as UPS battery bursts
యూపీఎస్​ పేలి ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత

UPS battery bursts: తమిళనాడులోని కోయంబత్తూర్​లో దారుణం జరిగింది. యూపీఎస్​ బ్యాటరీ పేలి ఓ మహిళ సహా ఇద్దరు చిన్నారులు చనిపోయారు. వీరితో పాటు ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క కూడా మరణించినట్లు అధికారులు తెలిపారు.

చనిపోయిన వారిని విజయలక్ష్మీ (50), అర్చన (24), అంజలీ(21)గా పోలీసులు గుర్తించారు. యూపీఎస్​ పేలడం వల్ల ఇంటి చూట్టూ పొగలు కమ్ముకున్నట్లు స్థానికులు తెలిపారు. ఇది చూసి అత్యవసర సేవల విభాగాలకు సమాచారం అందించినట్లుగా పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఘటనా స్థలికి చేరిన సిబ్బంది మంటలు ఆర్పారు. అప్పటికే వారు చనిపోయినట్లు గుర్తించారు. యూపీఎస్​ బ్యాటరీ.. హాల్​లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇదీ చూడండి: 12-14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా.. ఈ 10 విషయాలు తెలుసుకోవాల్సిందే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.