ETV Bharat / bharat

'నోట్ల రద్దు ఓ విపత్తు'- కేంద్రంపై ప్రియాంక ధ్వజం

author img

By

Published : Nov 8, 2021, 12:04 PM IST

నోట్ల రద్దును ఓ 'విపత్తు' అని అభివర్ణించారు (Priyanka Gandhi news) కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఒకవేళ అది సరైన నిర్ణయమే అయితే.. అవినీతి ఎందుకు అంతం కాలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. నోట్ల రద్దుకు నేటితో ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Priyanka Gandhi news
నోట్ల రద్దు

నోట్ల రద్దు.. భాజపా ప్రభుత్వ భారీ వైఫల్యమని (Priyanka Gandhi latest news) కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఒకవేళ అది సరైన నిర్ణయమే అయితే.. అవినీతి ఎందుకు అంతం కాలేదని ప్రశ్నించారు. నల్లధనాన్ని స్వదేశానికి ఎందుకు తీసుకురాలేదని మండిపడ్డారు. నోట్ల రద్దు చేసి నేటితో ఐదేళ్లు గడుస్తున్న సందర్భంగా (demonetisation fifth anniversary) ఈ మేరకు స్పందించారు.

"నోట్ల రద్దు సరైనా నిర్ణయమే అయితే.. నల్లధనాన్ని స్వదేశానికి ఎందుకు తీసుకురాలేదు? నగదు రహిత ఆర్థిక వ్యవస్థ, ఉగ్రవాదం కట్టడి సాధ్యం కాకపోవటానికి కారణాలేంటి? ద్రవ్యోల్బణం ఎందుకు పెరిగిపోతోంది?"అని ట్విట్టర్ వేదికగా ప్రియాంక ప్రశ్నించారు.

  • अगर नोटबंदी सफल थी तो

    भ्रष्टाचार खत्म क्यों नहीं हुआ?
    कालाधन वापस क्यों नहीं आया?
    अर्थव्यवस्था कैशलेस क्यों नहीं हुई?
    आतंकवाद पर चोट क्यों नहीं हुई?
    महंगाई पर अंकुश क्यों नहीं लगा?#DemonetisationDisaster

    — Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రజల ప్రయోజనం ఆశించి నోట్ల రద్దు చేయలేదని కేంద్రాన్ని కాంగ్రెస్ విమర్శిచింది. ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడిందని ఆరోపించింది.

2016 నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది కేంద్రం (demonetisation in india).

ఇదీ చదవండి: జమ్ముకశ్మీర్​లో పోలీస్​ను కాల్చిచంపిన ఉగ్రవాదులు

దిల్లీలో ప్రమాదకర స్థాయికి గాలి నాణ్యత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.