ETV Bharat / bharat

మోదీపై అనుచిత వ్యాఖ్యల కేసులో పవన్​కు మరింత ఊరట.. అప్పటివరకు బెయిల్​ పొడిగింపు

author img

By

Published : Feb 27, 2023, 3:57 PM IST

ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్​ సీనియర్​ నేత పవన్​ ఖేడాకు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్​ను వచ్చే నెల 3 వరకు పొడిగించింది.

Congress Leader Pawan Kheda Bail Extension
కాంగ్రెస్​ నేత పవన్​ ఖేడా బెయిల్​ పొడిగింపు

ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వివాదంలో కాంగ్రెస్​ సీనియర్​ నేత పవన్​ ఖేడాకు దేశ సర్వోన్నత న్యాయస్థానం మంజూరు చేసిన మధ్యంతర బెయిల్​ను మార్చి 3 వరకు పొడిగించింది.
ప్రధాని మోదీ పేరును వక్రీకరించి పలికినందుకుగానూ పవన్​ ఖేడా ఈ వివాదంలో చిక్కుకున్నారు. ఈ కేసులో ఖేడాను అసోం పోలీసులు ఈ నెల 23న దిల్లీ పోలీసుల సాయంతో దిల్లీ విమానాశ్రయంలోనే హైడ్రామా నడుమ అరెస్టు చేశారు. అయితే ఖేడాకు కాసేపటికే సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. వివిధ నగరాల్లో ఆయనపై నమోదైన ఎఫ్​ఐఆర్​లకు సంబంధించి పూర్తి వివరాలు తమకు సమర్పించాలని అసోం, ఉత్తప్​ప్రదేశ్​ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు సోమవారం రెండు రాష్ట్రాల తరఫున హాజరైన న్యాయవాదులు తుషార్​ మెహతా, గరిమా ప్రసాద్​ ఈ విషయంపై సంబంధిత పోలీసులు తమ వివరణను త్వరలోనే తెలియజేస్తారని జస్టిస్ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి నివేదించారు. ఇరు రాష్ట్రాల వాదనలతో సంతృప్తి చెందిన న్యాయమూర్తులు ఈ కేసు విచారణను వచ్చే నెల 3కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 23న ఖేడాకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్​ గడువు కూడా అప్పటి వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదీ జరిగింది..
ప్రధాని మోదీపై ఈ నెల 17న ముంబయిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఖేడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు. దీనిపై అసోం బీజేపీ నేత ఒకరు అసోంలోని దిమా హసావో జిల్లాలోని హఫ్లాంగ్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. వారణాసి, లఖ్​నవూ నగరాల్లో కూడా పవన్​ ఖేడాపై ఎఫ్​ఐఆర్​లు నమోదయ్యాయి. దిల్లీ పోలీసులు సహకారంతో ఆయన్ను ఫిబ్రవరి 23న అసోం పోలీసులు హైడ్రామా నడుమ దిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఈ విషయంపై కాంగ్రస్​ నేతలు సుప్రీంను ఆశ్రయించడం వల్ల పవన్​కు ఊరట లభించింది. కాగా, ఆ సమయంలో పవన్​ ఈ నెల 24 నుంచి 26 వరకు రాయ్​పుర్​లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యేందుకు పలువురు సీనియర్​ నేతలతో కలిసి విమానం వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఫ్లైట్​ టేకాఫ్​కు కొద్ది నిమిషాల ముందే ఎయిర్​లైన్స్​ సిబ్బంది ఆయన్ను ఏదో లగేజీ విషయంలో గందరగోళం ఉందని.. కిందకు దిగవల్సిందిగా కోరడం వల్ల ఈ రచ్చ మొదలైంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.