ETV Bharat / bharat

నాగార్జున సాగర్‌ డ్యామ్ భద్రత, కార్యకలాపాలు కేఆర్‌ఎంబీకి !

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 5:30 PM IST

Nagarjuna Sagar Dam Controversy: నాగార్జున సాగర్‌ భద్రత, కార్యకలాపాలను కేఆర్‌ఎంబీకి అప్పగించాలని కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది. సాగర్‌ వద్ద సీఆర్‌పీఎఫ్‌ పర్యవేక్షణ కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని జలశక్తి శాఖ అధికారులు తెలిపారు.

Nagarjuna_Sagar_Dam_Controversy
Nagarjuna_Sagar_Dam_Controversy

Nagarjuna Sagar Dam Controversy : నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు ఎవరివనే అంశంపై గత కొంత కాలంగా సరైన స్పష్టత లేదు. కానీ నాగార్జున సాగర్‌ నిర్వహణ విషయంలో నెలకొన్న సందిగ్ధత వీడినట్లు తెలుస్తోంది. నాగార్జున సాగర్‌ భద్రత (Nagarjuna Sagar Security), కార్యకలాపాలను కేఆర్‌ఎంబీకి అప్పగించాలని కేంద్రం ఆదేశించినట్లు సమాచారం. సాగర్‌ వద్ద సీఆర్‌పీఎఫ్‌ పర్యవేక్షణ కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని జలశక్తి శాఖ అధికారులు తెలిపారు.

Nagarjuna Sagar Security and Operations to KRMB : తెలంగాణ ఎన్నికల సమయంలో సాగర్‌ వద్ద జరిగిన ఘటనల దృష్ట్యా రెండు రాష్ట్రాల అధికారులతో జలశక్తి శాఖ సమీక్ష నిర్వహించింది. సాగర్‌ నిర్వహణపై ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం చెబుతామని అధికారులు తెలిపారు. విద్యుత్‌ ప్రాజెక్టులు, అవుట్‌లెట్స్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న అధికారులు, సాంకేతిక పరిమితులపైనా నిర్ణయించాల్సి ఉందన్నారు. ఏయే అవుట్‌లెట్స్‌ ఎవరి పరిధిలో ఉండాలో కూడా తేలాల్సి ఉందని అధికారులు తెలిపారు. సాంకేతిక అంశాలపై ఇద్దరు సీఈవోలు చర్చించి నిర్ణయానికి రావాలని జలశక్తి శాఖ సూచించింది. సాంకేతిక అంశాలపై నివేదిక వచ్చాకే తదుపరి భేటీ ఉంటుందని స్పష్టం చేసింది.

ఉద్రిక్త పరిస్థితికి ముగింపు - నాగార్జున సాగర్‌ డ్యాం వద్ద ఫెన్సింగ్, బారికేడ్లు తొలగింపు

Telugu States Sagar Dam Issue : శాసనసభ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్వహణ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది. బోర్డుకు ఇండెంట్‌ ఇస్తున్నా తెలంగాణను పదేపదే అడగాల్సి వస్తోందని, 13వ గేటు నుంచి తమ వైపు ఉన్న గేట్లను తామే ఆపరేట్‌ చేసుకుంటామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని కృష్ణ బోర్డుకు రాసిన లేఖలో ప్రస్తావించింది.

AP and Telangana Nagarjuna Sagar Issue : ప్రస్తుతం 13వ క్రెస్ట్‌ నుంచి ఏపీ పరిధిలో మిగతా భాగమంతా తెలంగాణ పరిధిలో ఉన్నది. తమ పరిధిలో ఉన్న ప్రాజెక్టును ఏపీ బలవంతంగా ఆక్రమించిందని తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో కేంద్ర బలగాలు రంగ ప్రవేశంతో కాస్త ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆ విషయంలో కేంద్ర హోం శాఖ, జలవనరుల శాఖలు రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, కృష్ణా బోర్డుకు చెందిన ఇద్దరు అధికారులు క్షేత్ర స్థాయి పరీశీలన చేశారు.

నాగార్జునసాగర్‌ నిర్వహణ ఎవరిది? - తెలంగాణ, ఏపీల మధ్య తేలని పంచాయితీ

Nagarjuna Sagar Project Dispute : ఐతే ఏపీ పునర్వ్యవస్థీకణ చట్టం ప్రకారం సాగర్‌ నిర్వహణ తెలంగాణే చూస్తుందని, కాబట్టి వెంటనే ప్రాజెక్టును అప్పగించాలని తెలంగాణ కేంద్రానికి వరుస లేఖలు రాసింది. కేంద్ర హోంశాఖ సూచించిన విధంగా 2023 నవంబర్‌ 28కి ముందు ఉన్న పరిస్థితిని కొనసాగేలా చూడాలని కోరుతోంది. తాజాగా ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు ఇరిగేషన్ డిపార్ట్​మెంట్‌కు లేఖ రాసినట్లు సమాచారం.

ఏపీ అధీనంలో ఉన్న, 13వ గేటు వరకే పనులు చేస్తున్నామని, డ్యాం మొత్తం అప్పగిస్తే తప్ప పూర్తి చేయలేమని ఆ లేఖలో రాసినట్లు విశ్వసనీయం సమాచారం. అదే లేఖలో రోజువారీ ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోతో పాటు విద్యుదుత్పత్తికి సంబంధించి వివరాలు నమోదు చేయలేకపోతున్నామని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. రెండు వైపులా ఉన్న కాలువల లీకేజీ నీటి విడుదల విషయాలు నమోదు చేయాల్సి ఉండగా ఏపీ వైపునున్న సమాచార సేకరణ లభ్యమవడం లేదని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రాజెక్ట్ విషయంలో నెలకొన్న సందిగ్ధత తీరిపోయేలా కేంద్రం చర్యలు ఉంటాయని అంతా ఆశిస్తున్నారు.

సాగర్ కుడికాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి - ఏపీకి కృష్ణా బోర్డు అదేశం

Nagarjuna Sagar Dam Controversy : నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు ఎవరివనే అంశంపై గత కొంత కాలంగా సరైన స్పష్టత లేదు. కానీ నాగార్జున సాగర్‌ నిర్వహణ విషయంలో నెలకొన్న సందిగ్ధత వీడినట్లు తెలుస్తోంది. నాగార్జున సాగర్‌ భద్రత (Nagarjuna Sagar Security), కార్యకలాపాలను కేఆర్‌ఎంబీకి అప్పగించాలని కేంద్రం ఆదేశించినట్లు సమాచారం. సాగర్‌ వద్ద సీఆర్‌పీఎఫ్‌ పర్యవేక్షణ కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని జలశక్తి శాఖ అధికారులు తెలిపారు.

Nagarjuna Sagar Security and Operations to KRMB : తెలంగాణ ఎన్నికల సమయంలో సాగర్‌ వద్ద జరిగిన ఘటనల దృష్ట్యా రెండు రాష్ట్రాల అధికారులతో జలశక్తి శాఖ సమీక్ష నిర్వహించింది. సాగర్‌ నిర్వహణపై ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం చెబుతామని అధికారులు తెలిపారు. విద్యుత్‌ ప్రాజెక్టులు, అవుట్‌లెట్స్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న అధికారులు, సాంకేతిక పరిమితులపైనా నిర్ణయించాల్సి ఉందన్నారు. ఏయే అవుట్‌లెట్స్‌ ఎవరి పరిధిలో ఉండాలో కూడా తేలాల్సి ఉందని అధికారులు తెలిపారు. సాంకేతిక అంశాలపై ఇద్దరు సీఈవోలు చర్చించి నిర్ణయానికి రావాలని జలశక్తి శాఖ సూచించింది. సాంకేతిక అంశాలపై నివేదిక వచ్చాకే తదుపరి భేటీ ఉంటుందని స్పష్టం చేసింది.

ఉద్రిక్త పరిస్థితికి ముగింపు - నాగార్జున సాగర్‌ డ్యాం వద్ద ఫెన్సింగ్, బారికేడ్లు తొలగింపు

Telugu States Sagar Dam Issue : శాసనసభ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్వహణ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది. బోర్డుకు ఇండెంట్‌ ఇస్తున్నా తెలంగాణను పదేపదే అడగాల్సి వస్తోందని, 13వ గేటు నుంచి తమ వైపు ఉన్న గేట్లను తామే ఆపరేట్‌ చేసుకుంటామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని కృష్ణ బోర్డుకు రాసిన లేఖలో ప్రస్తావించింది.

AP and Telangana Nagarjuna Sagar Issue : ప్రస్తుతం 13వ క్రెస్ట్‌ నుంచి ఏపీ పరిధిలో మిగతా భాగమంతా తెలంగాణ పరిధిలో ఉన్నది. తమ పరిధిలో ఉన్న ప్రాజెక్టును ఏపీ బలవంతంగా ఆక్రమించిందని తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో కేంద్ర బలగాలు రంగ ప్రవేశంతో కాస్త ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆ విషయంలో కేంద్ర హోం శాఖ, జలవనరుల శాఖలు రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, కృష్ణా బోర్డుకు చెందిన ఇద్దరు అధికారులు క్షేత్ర స్థాయి పరీశీలన చేశారు.

నాగార్జునసాగర్‌ నిర్వహణ ఎవరిది? - తెలంగాణ, ఏపీల మధ్య తేలని పంచాయితీ

Nagarjuna Sagar Project Dispute : ఐతే ఏపీ పునర్వ్యవస్థీకణ చట్టం ప్రకారం సాగర్‌ నిర్వహణ తెలంగాణే చూస్తుందని, కాబట్టి వెంటనే ప్రాజెక్టును అప్పగించాలని తెలంగాణ కేంద్రానికి వరుస లేఖలు రాసింది. కేంద్ర హోంశాఖ సూచించిన విధంగా 2023 నవంబర్‌ 28కి ముందు ఉన్న పరిస్థితిని కొనసాగేలా చూడాలని కోరుతోంది. తాజాగా ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు ఇరిగేషన్ డిపార్ట్​మెంట్‌కు లేఖ రాసినట్లు సమాచారం.

ఏపీ అధీనంలో ఉన్న, 13వ గేటు వరకే పనులు చేస్తున్నామని, డ్యాం మొత్తం అప్పగిస్తే తప్ప పూర్తి చేయలేమని ఆ లేఖలో రాసినట్లు విశ్వసనీయం సమాచారం. అదే లేఖలో రోజువారీ ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోతో పాటు విద్యుదుత్పత్తికి సంబంధించి వివరాలు నమోదు చేయలేకపోతున్నామని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. రెండు వైపులా ఉన్న కాలువల లీకేజీ నీటి విడుదల విషయాలు నమోదు చేయాల్సి ఉండగా ఏపీ వైపునున్న సమాచార సేకరణ లభ్యమవడం లేదని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రాజెక్ట్ విషయంలో నెలకొన్న సందిగ్ధత తీరిపోయేలా కేంద్రం చర్యలు ఉంటాయని అంతా ఆశిస్తున్నారు.

సాగర్ కుడికాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి - ఏపీకి కృష్ణా బోర్డు అదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.