ETV Bharat / bharat

కేరళలో 20వేల కరోనా కేసులు- మిగతా రాష్ట్రాల్లో ఇలా..

author img

By

Published : Aug 20, 2021, 11:36 PM IST

కేరళలో కరోనా(Corona cases) ఉద్ధృతి కొనసాగుతోంది. అక్కడ కొత్తగా 20,224 కేసులు వెలుగుచూశాయి. ఇక మహారాష్ట్రలో ఒక్కరోజే 4వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదవగా.. తమిళనాడులో 1,667 మందికి వైరస్​ సోకింది.

corona cases in states
రాష్ట్రాల్లో కరోనా కేసులు

కేరళలో కరోనా (Corona cases) విజృంభణ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 20,224 కేసులు నమోదయ్యాయి. మరో 17,142 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 99 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 37.86 లక్షలకు చేరింది.

మహారాష్ట్రలో కొత్తగా 4,365 కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 105 మంది చనిపోగా.. కొత్తగా 6,384 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. దేశ రాజధాని దిల్లీలో.. 57 మందికి వైరస్​ సోకింది. కరోనా కారణంగా ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. కరోనా రెండో దశ వ్యాప్తి తర్వాత దిల్లీలో ఒక్క మరణం కూడా నమోదవకపోవడం ఇది పదకొండోసారి.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

  • తమిళనాడులో 1,667 మంది మహమ్మారి బారిన పడ్డారు. 1,887 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరో 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో కొత్తగా 1,298 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,833 మంది కోలుకోగా.. 32 మంది మృతిచెందారు.
  • ఒడిశాలో కొత్తగా 986 మందికి కరోనా సోకగా.. 69 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • గుజరాత్​లో​ 17, ఉత్తర్​ప్రదేశ్​లో 26, మధ్యప్రదేశ్​లో 8 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి.
  • పంజాబ్​లో మరో 59 కేసులు నమోదు కాగా.. వైరస్​ బాధితుల సంఖ్య 6,00,180కి పెరిగింది.
  • అసోంలో.. 708 కరోనా కేసులు వెలుగు చూడగా మరో 13 మంది మరణించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.