ETV Bharat / bharat

పీడ కలల భయంతో విద్యార్థి ఆత్మహత్య.. దళితులను మరుగుదొడ్డికి వెళ్లనివ్వని అగ్రకులాలు

author img

By

Published : Dec 21, 2022, 9:23 PM IST

హిమాచల్​ప్రదేశ్​ విషాదకర ఘటన జరిగింది. రాత్రిపూట పీడ కలలు వస్తున్నాయని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి రూంలో సూసైడ్ నోట్​ సైతం లభ్యమైంది. మంగళవారం ఈ ఘటన జరిగింది. మరోపక్క కొడుకు చనిపోయాడని రాజస్థాన్​లో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తర్​ప్రదేశ్​లో దళితులను మరుగుదొడ్డికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు అగ్రకులాల వ్యక్తులు.

student commits suicide due to sleep deprivation
student commits suicide due to sleep deprivation

రాత్రిపూట పీడ కలలు వస్తున్నాయని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఈ ఘటన జరిగింది. మృతుడి రూంలో సూసైడ్ నోట్​ సైతం లభ్యమైంది. హిమాచల్​ప్రదేశ్​లో ఈ విషాదకర ఘటన జరిగింది. కాగా మృతుడు, అతని కుటుంబ సభ్యులు.. కుల్లూ జిల్లా బంజారా ఏరియాలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడికి 17 సంవత్సరాలు ఉంటాయి. అతడికి రాత్రిపూట పదే పదే పీడకలలు వచ్చేవి. దీంతో మృతుడు విపరీతంగా ఆందోళన చెందాడు. గత ఏడు రోజులుగా అతడు నిద్ర కూడా పోలేదు. నిద్రలేమితో కలత చెందిన అతను.. తన రూంలో అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరుసటి రోజు ఈ ఘటనను చూసిన మృతుడి సోదరి.. సమాచారాన్ని పోలీసులకు తెలియజేసింది. వెంటనే ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్ట్​మార్టం పరీక్షల నిమ్మితం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు ఎటువంటి అనుమానం వ్యక్తం చేయలేదన్నారు పోలీసులు.

కొడుకు చనిపోయాడని కుటుంబం ఆత్మహత్య..
రాజస్థాన్​లోని ఓ కుటుంబంలో తీవ్ర విషాదం జరిగింది. కొడుకు చనిపోయాడని.. ఇద్దరు భార్యభర్తలు తమ కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. బళ్లారాం, మీరా భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరంతా పాలి జిల్లాలోని మేఘవాల్ గ్రామంలో నివాసం ఉంటున్నారు.

బళ్లారాం కుమారుడు భీమ్​రావ్(​3).. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బుధవారం అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో అతన్ని ఆసుపత్రికి తీసుకువెళుతుండగా.. మార్గమధ్యలోనే మరణించాడు. భీమ్​రావ్ మరణాన్ని తట్టుకోలేని ఆ కుటుంబం.. ఆత్మహత్యకు పాల్పడింది. కాగా స్కూల్​కు వెళ్లిన బళ్లారాం మరో ఎనిమిదేళ్ల కూతురు అనాథగా మిగిలింది.

దళితులను మరుగుదొడ్డికి వెళ్లనివ్వకుండా..
ఉత్తర్​ప్రదేశ్​లో అవమానకర ఘటన వెలుగులోకి వచ్చింది. దళితులను మరుగుదొడ్డికి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారు అగ్రకులాలకు చెందిన కొందరు వ్యక్తులు. ఓ దళిత మహిళ వివాహానికి ఊర్లో బరాత్​ నిర్వహించినందుకే ఇలా చేస్తున్నారని దళితులు ఆరోపిస్తున్నారు. కాగా మథుర జిల్లా బర్సానా పోలీసు స్టేషన్​ పరిధిలోని కామై అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే.. నవంబర్​ 4న బినామి అనే దళిత వ్యక్తి కుమార్తె పెళ్లి ఊరేగింపు జరిగింది. అంబేడ్కర్ ఫొటోతో ఈ వేడుక జరిగింది. ఈ ఊరేగింపు సమయంలో అగ్రకులాలకు, దళితులకు మధ్య వాగ్వాదం జరిగింది.​ అనంతరం ఘటనపై గ్రామ దళితులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆగ్రహించిన అగ్రకులాలకు చెందిన కొందరు వ్యక్తులు.. దళితులను మరుగుదొడ్డికి వెళ్లనివ్వకుండా అడ్డకుంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ వందలాది మంది దళితులు మరోసారి పోలీసులను ఆశ్రయించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.