ETV Bharat / bharat

'ఆగస్టు కల్లా 25 కోట్ల మందికి కొవిడ్​ టీకా'

author img

By

Published : Nov 5, 2020, 8:43 AM IST

ప్రపంచ దేశాలన్నీ కొవిడ్​ టీకా తయారీలో నిమగ్నమయ్యాయి. ఈ తరుణంలో వచ్చే ఏడాది ఆగస్టు నాటికి 20-25 కోట్ల మందికి టీకా అందించాలనే లక్ష్యంగా ముందడుగు వేస్తోంది భారత్​.

Covaxin_india
ఆగస్టు కల్లా 25 కోట్ల మందికి కొవిడ్​ టీకా అందించాలి: భారత్

వచ్చే ఏడాది జులై-ఆగస్టు కల్లా కొవిడ్ టీకాను 20 నుంచి 25 లక్షల మందికి అందించాలని భారత్​ లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో ఆరోగ్య సేవా సిబ్బందికి, పెద్ద వయస్కులకు ఈ టీకాను అందించనున్నట్లు అధికారులు తెలిపారు

" దేశీయ కొవిడ్​ వ్యాక్సిన్ తయారీ విజయవంతం చేసేందుకు భారత్​ చురుగ్గా పనిచేస్తోంది. వచ్చే ఏడాది తొలినాళ్లలోనే భారత్​ బయోటెక్, జైడస్ కాడిలా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయి".

- ఓ వైద్యాధికారి.

రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ...

ఇటీవలే కేంద్ర ఆరోగ్య ప్రతినిధి రాజేశ్ భూషణ్ పలు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ప్రతి ప్రాంతంలో 'ఇమ్యూనైజేషన్​ మానిటరింగ్ సెల్' ఏర్పాటు చేయాలని కోరారు. వ్యాక్సిన్​ మొదటగా ఆరోగ్య సేవలందిస్తోన్న సిబ్బందికి, వయసు పైబడినవారికి అందించనున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు.

" వచ్చే ఏడాది తొలి దశలో భారత్​ చేస్తోన్న కొవిడ్​ వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చు. దీనికోసం భారత శాస్త్రవేత్తలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. క్లినికల్​ ట్రయల్స్​లోనూ భారత కొవాగ్సిన్​ మెరుగైన ఫలితాలు ఇస్తోంది".

- డాక్టర్. జ్ఞాని, అసోసియేషన్​ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ డీజీ.

ఇదీ చదవండి:ప్రపంచంలోని టాప్​-20 పెట్టుబడిదారులతో మోదీ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.