ETV Bharat / bharat

18 ఏళ్ల కుమార్తెను బలిచ్చేందుకు సిద్ధమైన తండ్రి.. గుప్త నిధుల కోసం...

author img

By

Published : Apr 27, 2022, 3:56 PM IST

Human sacrifice in Maharashtra: గుప్త నిధుల కోసం సొంత కుమార్తెనే బలిచ్చేందుకు సిద్ధమయ్యాడు ఓ తండ్రి. ఇంట్లోనే గొయ్యి తవ్వి అన్ని ఏర్పాట్లు చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్ర, యావత్మాల్​ జిల్లాలో సోమవారం జరిగింది. ఈ కేసులో మొత్తం తొమ్మిది మందిని అరెస్ట్​ చేశారు పోలీసులు. బిహార్​లో జరిగిన మరో ఘటనలో తుపాకులతో బెదిరించి ఇద్దరు అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్​ రేప్​కు పాల్పడ్డారు ఇద్దరు దుండగులు.

human sacrifice
కుమార్తెను బలిచ్చేందుకు ఏర్పాట్లు

Human sacrifice in Maharashtra: గుప్త నిధుల వేటలో కొందరు అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మనుషులను బలిస్తే ఎన్నడూ చూడనంత సంపద లభిస్తుందని కొందరు చెప్పే కట్టుకథలను నమ్మి సొంత వారిని సైతం బలిచేసేందుకు వెనకాడటం లేదు. అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని యావత్మాల్​ జిల్లాలో వెలుగు చూసింది. గుప్త నిధుల కోసం 18 ఏళ్ల కన్న కూతురినే బలిచ్చేందుకు సిద్ధమయ్యాడు ఓ తండి. గత సోమవారం బాబుల్గావూన్​ తహసీల్​లోని మద్ని గ్రామంలో గుప్తు నిధుల కోసం బలి ఇస్తున్నారని తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తాంత్రికుడు, బాలిక తండ్రితో పాటు మరో ఏడుగురిని అరెస్ట్​ చేసి జైలుకు పంపారు.

ఇదీ జరిగింది: నిందితుల్లో ఒకరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు బంధువుల ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటోంది. ఇటీవలే తన సొంత ఊరికి వచ్చింది. ఈ క్రమంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడి బెదిరించాడు తండ్రి. ఆ తర్వాత ఇంట్లో తాంత్రిక పూజలు చేయటం ప్రారంభించాడు. తన కుమార్తెను సజీవంగా ఖననం చేసేందుకు ఏప్రిల్​ 25న ఇంట్లోనే పెద్ద గొయ్యి తవ్వాడు. ఈ విషయాన్ని గమనించిన బాలిక తన స్నేహితురాలికి సమాచారం చేరవేసింది. ఆమె పోలీసులకు చెప్పింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షుద్ర పూజలు చేస్తున్న వారిని అరెస్ట్​ చేసి బాలికను రక్షించినట్లు యావత్మాల్​ ఎస్పీ దిలీప్​ భుజ్బాల్​ పాటిల్​ తెలిపారు. హత్యాయత్నం(307), 376(అత్యాచారం), ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

తుపాకులతో బెదిరించి అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్​ రేప్​: తుపాకులతో బెదిరించి ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బిహార్​, పట్నాలోని ఫుల్వారీ షరీఫ్​లో వెలుగు చూసింది. బాధితుల ఫిర్యాదు ప్రకారం.. గతం సోమవారం రాత్రి ఇద్దరు అక్కచెల్లెళ్లు బహిర్భూమికి వెళ్లారు. ఇద్దరు దుండగులు ఆయుధాలతో బైక్​లపై అక్కడికి చేరుకుని వారిని బెదిరించారు. రాత్రంతా వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వారు అరిచేందుకు ప్రయత్నించగా చంపేస్తామని తుపాకీ చూపించారు.

తమ పేరు వికాశ్​ కుమార్​, సమీర్​ కుమార్​ అని, పోలీసులు సైతం తమను ఏమీ చేయలేరని చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. మంగళవారం ఉదయం తమ కుటుంబ సభ్యులతో నేరుగా ఖగౌల్​ పోలీస్​ స్టేషన్​ చేరుకుని ఫిర్యాదు చేశారు బాధితులు. ఫిర్యాదు అందుకున్న కొన్ని గంటల్లోనే నిందితులిద్దరిని అరెస్ట్​ చేశారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

gang rape
గ్యాంగ్​ రేప్​ నిందితులు

బాలికను కిడ్నాప్​ చేసి అత్యాచారం: మహారాష్ట్రలోని ఠాణెలో ఓ బాలికను అపహరించి, అత్యాచారానికి పాల్పడిన రెండేళ్ల క్రితం నాటి కేసులో 27 ఏళ్ల వ్యక్తిని బంగాల్​లో బుధవారం అరెస్ట్​ చేశారు పోలీసులు. ఠాణెలోని ఉల్హాస్​నగర్​ టౌన్​షిప్​లో నిందితుడు మేస్త్రీగా పని చేసేవాడు. బాలిక(ప్రస్తుతం 16 ఏళ్లు)ను అపహరించి బంగాల్​లోని తన సొంత గ్రామానికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే బాలిక కుటుంబ సభ్యులు గుర్తు తెలియని వ్యక్తిపై కిడ్నాప్​ కేసు పెట్టారు.

ఇటీవలే నిందితుడి సమాచారం తెలుసుకున్న ఠాణె పోలీసులు.. బంగాల్​, ముర్షీదాబాద్​ జిల్లాలోని బుర్వాన్​ గ్రామానికి మంగళవారం చేరుకున్నారు. నిందితుడిని అరెస్ట్​ చేసి బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. ఐపీసీలోని పలు సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు హిల్​ లైన్​ పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. దివ్యాంగురాలిని చెట్టుకు కట్టేసి..

మరో పరువు హత్య... పెళ్లైన ఆరు రోజులకే దారుణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.