ETV Bharat / bharat

'చెత్త బండి'లో కరోనా మృతదేహాల తరలింపు

author img

By

Published : Apr 15, 2021, 2:22 PM IST

కొవిడ్​ కారణంగా మానుషుల్లో మానవత్వం నశించిపోతోంది. కరోనాతో మృతిచెందిన వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఛత్తీస్​గఢ్​లో వైరస్​తో చనిపోయిన వారిని.. శ్మశానవాటికకు తరలించేందుకు అక్కడి అధికారులు.. చెత్త తరలించే బండిని ఉపయోగించడం కలచివేస్తోంది.

Garbage van ferries bodies
చెత్త వాహనంలో కరోనా మృతదేహాల తరలింపు

ఛత్తీస్‌గఢ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రాజ్‌నందగావ్‌ జిల్లా డోంగార్​గావ్ ప్రాంతంలో కరోనాతో మృతి చెందిన నలుగురి మృతదేహాలను చెత్త తరలించే వాహనాల్లో శ్మశానవాటికకు తీసుకెళ్లటం కలచివేస్తోంది.

అయితే.. ఆక్సిజన్‌ అందకపోవడం వల్లే కొవిడ్‌ బాధితులు చనిపోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మృతుల్లో.. ముగ్గురు రోగులు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో, మరొకరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో ప్రాణాలు విడిచినట్లు అధికారులు తెలిపారు.

Garbage van ferries bodies
కొవిడ్​ మృతదేహాలను స్ట్రెచర్​పైకి మార్చుతున్న వైద్య సిబ్బంది
Garbage van ferries bodies
చెత్తవాహనంలోకి మృతదేహాలను తరలిస్తున్నారిలా..
Garbage van ferries bodies
మృతదేహాలను శ్మశానవాటికకు తీసుకెళ్తున్న చెత్త వాహనం

ఇదీ చదవండి: ఆక్సిజన్​ తొలగించిన వార్డ్​ బాయ్​- కొవిడ్​ రోగి మృతి!

మరోవైపు.. ఆక్సిజన్‌ అందక చనిపోయారన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని జిల్లా వైద్యాధికారి పేర్కొన్నారు. ప్రతి కొవిడ్‌ సంరక్షణ కేంద్రంలో.. 10-15 ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మృతదేహాలను చెత్త వాహనాల్లో శ్మశానవాటికకు తరలించటం కలచి వేస్తోందన్నారు. అయితే.. అది తమ పని కాదని.. నగర పంచాయతీ పరిధిలోని అంశంగా వైద్యాధికారి చెప్పారు.

Garbage van ferries bodies
కొవిడ్​ కేర్​ సెంటర్​
Garbage van ferries bodies
స్ట్రెచర్​పై తీసుకొచ్చి.. చెత్త వాహనంలోకి

ఇదీ చదవండి: ఇలాగే కొనసాగితే.. రోజుకు 3 లక్షల కేసులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.