ETV Bharat / bharat

Delta Plus: రెండు డోసులు తీసుకున్నా.. 'డెల్టా ప్లస్'​కు బలి

author img

By

Published : Aug 13, 2021, 8:06 AM IST

ముంబయిలో.. కొవిడ్​ డెల్టా ప్లస్​(Delta Plus) వేరియంట్​ తొలి మరణం నమోదైంది. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. 63 ఏళ్ల వృద్ధురాలు ఈ వేరియంట్​కు బలైనట్లు అధికారులు వెల్లడించారు.

delta plus, covid
డెల్టా ప్లస్, కొవిడ్

మహారాష్ట్ర ముంబయిలో డెల్టా ప్లస్(Delta Plus)​ వేరియంట్ డేంజర్​ బెల్స్ మోగిస్తోంది. ముంబయికి చెందిన ఓ 63 ఏళ్ల వృద్ధురాలు.. రెండు డోసుల కొవిడ్​ వ్యాక్సిన్​ తీసుకున్నప్పటికీ డెల్టా వేరియంట్​ సోకి మృతిచెందారు.

ముంబయిలో డెల్టా ప్లస్​తో మృతిచెందిన మొదటి మహిళ ఈమే అని అధికారులు నిర్ధరించారు. తొలుత.. వృద్ధురాలు జులై 21న కొవిడ్​తో ఆసుపత్రిలో చేరారని తెలిపారు. పొడి దగ్గు, ఒంటినొప్పులు, రుచి కోల్పోవడం మొదలైన లక్షణాలు రోగిలో కనిపించాయని పేర్కొన్నారు. ఐసీయూలో చేర్చి చికిత్స అందించినప్పటికీ ఆమె జులై 27న మరణించినట్లు స్పష్టం చేశారు.

వృద్ధురాలికి డెల్టా ప్లస్ వేరియంట్(ఏవై.1) సోకినట్లు ఆగస్టు 11న మునిసిపల్ కార్పొరేషన్ వెల్లడించింది.

ఇదీ చదవండి:మరణానంతరం అవయవదానంతో మరో జీవితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.