ETV Bharat / bharat

కరోనా పరిహారంపై కేంద్రం కీలక మార్గదర్శకాలు

author img

By

Published : Sep 27, 2021, 11:54 AM IST

Updated : Sep 27, 2021, 1:44 PM IST

కరోనా కారణంగా మరణించినవారి (covid Compensation claims) కుటుంబాలకు రూ.50 వేలను పరిహారంగా అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీచేసింది కేంద్ర హోంశాఖ.

Compensation
కరోనా

కరోనా మృతుల(Corona deaths) కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం (covid Compensation claims) ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) ద్వారా ఈ పరిహారాన్ని అందించనున్నట్లు తెలిపింది.

కరోనా పరిహారం చెల్లింపుపై మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపింది కేంద్రం. దరఖాస్తు చేసిన 30 రోజుల్లోపు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే కరోనా కారణంగా మరణించినట్లు ధ్రువీకరణ పత్రం (Covid Death Certificate Download) తప్పనిసరని స్పష్టంచేసింది.

ఇదీ చూడండి: Corona Death Compensation: ఇంట్లో మరణించినా.. కరోనా పరిహారం

Last Updated : Sep 27, 2021, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.